epaper
Thursday, January 15, 2026
epaper

రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్‌

రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్‌
నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల మృతి
సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్‌కి చెక్‌
బిహార్‌ ఎన్నికల ముందు కుట్ర భగ్నం

కాకతీయ, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హతమైన వారిలో గ్యాంగ్ లీడర్‌ రంజన్ పాఠక్‌ కూడా ఉన్నారు. ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌, బిహార్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు.

జాయింట్ ఆపరేషన్‌లో దొరికిన ముఠా

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ముఠా పెద్ద కుట్రకు సిద్ధమవుతోందని నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు కదిలారు. ఉదయం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో రంజన్ పాఠక్‌, బిమ్లేష్ మహతో, మనీష్ పాఠక్‌, అమన్ ఠాకూర్‌ అనే నలుగురు దుండగులు మృతిచెందారు. ఈ నలుగురూ సిగ్మా అండ్ కంపెనీ పేరుతో బిహార్‌, ఢిల్లీలో అరాచకాలు సృష్టిస్తున్న ముఠాకు చెందినవారని పోలీసులు తెలిపారు. రంజన్ పాఠక్‌ ఆ గ్యాంగ్‌కి లీడర్‌. బిహార్‌లో వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో వీరందరూ ఉన్నారు అని తెలిపారు.

ఎన్నికల ముందు కుట్ర అడ్డుకున్న పోలీసులు

బీహార్‌ ఎన్నికల ముందు పెద్ద స్థాయి గ్యాంగ్‌ హింసకు వీరంతా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జరిగిన ఆపరేషన్‌లో పోలీసులు కుట్రను అడ్డుకున్నారు. రోహిణి ప్రాంతం కొంతసేపు ఉత్కంఠభరితంగా మారింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. హతమైనవారిలో (గ్యాంగ్ లీడర్) రంజన్ పాఠక్‌ , బిమ్లేష్ మహతో, మనీష్ పాఠక్‌, అమన్ ఠాకూర్‌ లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు బిహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందినవారు, ఒకరు ఢిల్లీ నివాసి చెందిన ప్రాంతంగా గుర్తించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

దేశంలోనే ధనవంతమైన బల్దియా !

దేశంలోనే ధనవంతమైన బల్దియా ! ఆదాయంలో బీఎంసీ రికార్డు..! మేయర్ ఎన్నికల వేళ ప్రత్యేక...

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ

ఉమర్ ఖాలిద్‌కు న్యూయార్క్ మేయర్ లేఖ జైలు డైరీ చదివానంటూ మద్దతు వివాదంగా మారిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img