epaper
Sunday, March 1, 2026
epaper

రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్‌

రోహిణిలో భారీ ఎన్‌కౌంటర్‌
నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల మృతి
సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్‌కి చెక్‌
బిహార్‌ ఎన్నికల ముందు కుట్ర భగ్నం

కాకతీయ, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీహార్‌కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు హతమయ్యారు. హతమైన వారిలో గ్యాంగ్ లీడర్‌ రంజన్ పాఠక్‌ కూడా ఉన్నారు. ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌, బిహార్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారు.

జాయింట్ ఆపరేషన్‌లో దొరికిన ముఠా

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ముఠా పెద్ద కుట్రకు సిద్ధమవుతోందని నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు కదిలారు. ఉదయం ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో రంజన్ పాఠక్‌, బిమ్లేష్ మహతో, మనీష్ పాఠక్‌, అమన్ ఠాకూర్‌ అనే నలుగురు దుండగులు మృతిచెందారు. ఈ నలుగురూ సిగ్మా అండ్ కంపెనీ పేరుతో బిహార్‌, ఢిల్లీలో అరాచకాలు సృష్టిస్తున్న ముఠాకు చెందినవారని పోలీసులు తెలిపారు. రంజన్ పాఠక్‌ ఆ గ్యాంగ్‌కి లీడర్‌. బిహార్‌లో వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో వీరందరూ ఉన్నారు అని తెలిపారు.

ఎన్నికల ముందు కుట్ర అడ్డుకున్న పోలీసులు

బీహార్‌ ఎన్నికల ముందు పెద్ద స్థాయి గ్యాంగ్‌ హింసకు వీరంతా ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జరిగిన ఆపరేషన్‌లో పోలీసులు కుట్రను అడ్డుకున్నారు. రోహిణి ప్రాంతం కొంతసేపు ఉత్కంఠభరితంగా మారింది. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. హతమైనవారిలో (గ్యాంగ్ లీడర్) రంజన్ పాఠక్‌ , బిమ్లేష్ మహతో, మనీష్ పాఠక్‌, అమన్ ఠాకూర్‌ లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు బిహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందినవారు, ఒకరు ఢిల్లీ నివాసి చెందిన ప్రాంతంగా గుర్తించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

మానుకోటలో దొంగ బంగారం దందా?

మానుకోటలో దొంగ బంగారం దందా? నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి ఇతర రాష్ట్రాల చోరీ...

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img