epaper
Saturday, April 11, 2026
epaper

డీజీపీ ఎదుట మావోయిస్టుల స‌రెండ‌ర్‌

డీజీపీ ఎదుట మావోయిస్టుల స‌రెండ‌ర్‌
45మంది మావోయిస్టుల లొంగుబాటు
పీఎల్జీఏ బెటాలియన్‌కు భారీ దెబ్బ
కీలక కమాండర్లు సహా లొంగుబాటు
36 తుపాకులు, 1007 తూటాలు, 800 గ్రాముల బంగారం స్వాధీనం
నిరంతర ఆపరేషన్ల ఫలితమే ఈ పరిణామం
పునరావాస ప్యాకేజీలతో ప్ర‌భుత్వం ముంద‌కు : డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ కాలంగా అరణ్యాల్లో సాయుధ పోరాటం కొనసాగిస్తున్న సిపిఐ (మావోయిస్టు)కు చెందిన 42 మంది కేడర్లు తెలంగాణ పోలీసుల ఎదుట ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఈ ఘటనను భద్రతా వ్యవస్థలో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. లొంగిన వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ సోడి మల్ల @ కేశాల @ నిఖిల్, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు చాప నారాయణ @ గజేందర్ @ మధు, కడిరన్ను @ మంతు వంటి కీలక నాయకులతో పాటు ఇతర కేడర్లు కూడా ఉన్నారు. వీరంతా గత కొన్నేళ్లుగా వివిధ అరణ్య ప్రాంతాల్లో సాయుధ కార్యకలాపాలు నిర్వహిస్తూ పోలీసులకు సవాలు విసిరిన వారేనని అధికారులు తెలిపారు. లొంగుబాటు సమయంలో కేడర్లు తమ వద్ద ఉన్న భారీ ఆయుధ సామగ్రిని కూడా అప్పగించారు. మొత్తం 36 తుపాకులు, 1007 తూటాలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, 800 గ్రాముల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన ఆయుధాల్లో ఐదు ఏకే-47 రైఫిళ్లు, నాలుగు ఎస్ఎల్ఆర్‌లు, మూడు ఇన్సాస్ రైఫిళ్లు, ఆరు .303 రైఫిళ్లు, ఒక స్టెన్ గన్, పది సింగిల్ షాట్ గన్స్, రెండు రివాల్వర్లు, ఒక బీజీఎల్ గన్ ఉన్నాయి.

కీలక నాయకత్వం కూలింది

లొంగుబాటులో కీలక నాయకులు ఉండటం మావోయిస్టు సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా సోడి మల్ల @ కేశాల @ నిఖిల్ పీఎల్జీఏ బెటాలియన్ కార్యకలాపాలను నడిపించిన వ్యక్తిగా గుర్తింపు పొందినవాడు. అలాగే చాప నారాయణ @ గజేందర్ @ మధు తెలంగాణ రాష్ట్ర కమిటీకి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా వ్యవహరించినట్లు సమాచారం. కడిరన్ను @ మంతు కూడా సాయుధ దళాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ముగ్గురు సహా ఇతర కేడర్లు లొంగిపోవడంతో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ దాదాపు నిర్వీర్యమైందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ స్థాయిలో కూడా కార్యకలాపాలు క్షీణించినట్లు తెలుస్తోంది.

నిరంతర ఆపరేషన్ల ఫలితమే ఈ పరిణామం : డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి

ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ, “గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న వ్యూహాత్మక ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యల వల్లే ఈ భారీ లొంగుబాటు సాధ్యమైంది. మావోయిస్టు కేడర్‌లో భయం పెరిగింది. అభివృద్ధి, పునరావాస అవకాశాలు చూసి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు” అని పేర్కొన్నారు. “మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అణచివేయడమే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం పని చేస్తోంది. లొంగుబాటు చేసుకునే వారికి ప్రభుత్వం పూర్తి భద్రత, పునరావాసం కల్పిస్తుంది” అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2024 నుంచి 2026 వరకు మొత్తం 761 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. అదే కాలంలో 302 తుపాకులు స్వాధీనం చేసుకోవడం పోలీసుల ఆపరేషన్ల తీవ్రతను సూచిస్తోందన్నారు. లొంగుబాటు చేసిన కేడర్లను ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. కమిటీ స్థాయిని బట్టి రూ.1 లక్ష నుంచి రూ.20 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. ఆయుధాలతో లొంగిన వారికి అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నారు. మొత్తం రూ.1.93 కోట్ల ప్యాకేజీ కేడర్లకు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి పథకాలు, విద్యా సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అన్నా..నన్ను దేవుడే పంపిండు..మీతో కలిసి పనిచేయమని…

అన్నా..నన్ను దేవుడే పంపిండు.. మీతో కలిసి పనిచేయమని... మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి భావోద్వేగం కేసీఆర్​తో మాజీ...

ఆర్టీసీ ఉద్యోగులకు

ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.1 శాతం ఈ ఏడాది జనవరి నుంచే అమలు ఇంతకు...

యోగా మ‌న‌ జీవన విధానం

యోగా మ‌న‌ జీవన విధానం యోగాతో శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యత ప్ర‌పంచానికి...

రెడ్ అలర్ట్

రెడ్ అలర్ట్ తెలంగాణ‌లో దంచికొడుతున్న ఎండ‌లు రేపటి నుంచి మరింత పెర‌గున్న ఉష్ణోగ్ర‌త‌లు 10 రోజులపాటు...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! మారీచులపై టీజీఎండీసీ ఎండీ స్పంద‌న‌ బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2 అక్ర‌మాల‌పై ఎంక్వ‌యిరీకి భ‌వేశ్‌మిశ్రా...

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు శంషాబాద్ టు కిమ్స్ ఆసుపత్రి గ్రీన్ ఛానెల్ ద్వారా...

బాసర ఆలయానికి మహర్దశ

బాసర ఆలయానికి మహర్దశ శృంగేరి పీఠం నుంచి అనుమ‌తులు వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా...

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ది ప‌నుల్లో రాజీ ప‌డొద్దు టీటీడీ త‌ర‌హాలో ఏర్పాట్లు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img