epaper
Monday, March 2, 2026
epaper

మాట్లాడటానికి ఏం లేదు.. మావోయిస్టులు లొంగిపోవాల్సిందే : అమిత్‌ షా

కాకతీయ, నేషనల్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా మావోయిస్టుల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. ఆయుధాలు వదిలి చర్చలకు రావాలా? లేకపోతే పోరాటం కొనసాగించాలా? అన్న దానిపై వాళ్ల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

మావోయిస్టులతో ఇకపై ఎలాంటి చర్చలు జరగవని స్పష్టంచేశారు. “చర్చలకు అవకాశం లేదు, వాళ్లు చేయాల్సింది ఒక్కటే – ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోవడం” అని హోంమంత్రి స్పష్టం చేశారు. లొంగిపోయే మావోయిస్టులను ప్రభుత్వం స్వాగతిస్తుందని, వారికి పునరావాసం కల్పించడంతో పాటు అన్ని రకాల ప్రయోజనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా, 2026 మార్చి 31 నాటికి దేశం పూర్తిగా మావోయిస్టు రహితంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. “మావోయిస్టులు చర్చలు జరపాలని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు వారితో మాట్లాడటానికి ఏమీ మిగల్లేదు” అని ఆయన స్పష్టం చేశారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై కూడా అమిత్ షా దృష్టి సారించారు. బస్తర్ సహా ప్రభావిత జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి కృషి చేస్తున్నాయని చెప్పారు. “శాంతిని భంగం చేసే వారిని భద్రతా బలగాలు తగిన రీతిలో ఎదుర్కొంటాయి” అని హెచ్చరించారు. అమిత్ షా వ్యాఖ్యల ప్రకారం, ప్రభుత్వం ఇక మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా లేదు. వాళ్లు లొంగితేనే పునరావాసం, ప్రయోజనాలు లభిస్తాయి. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టుల ప్రభావం నుండి పూర్తిగా విముక్తమవుతుందని హోంమంత్రి నమ్మకం వ్యక్తం చేశారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img