కాకతీయ, తెలంగాణ బ్యూరో: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాతక్క పోలీసుల ముందు లొంగిపోయారు. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. పశ్చిమ బెంగాల్లో 2011 జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్ జీ భార్య ఆమె. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా ఉన్నారు. 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమెపై రూ. కోటి రివార్డు ఉంది.
సుజాతక్క లొంగుబాటు వివవాలను డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఆమె స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు. ఆమె మొదట్లో ఆర్ఎస్ యూ, జన నాట్య మండలిలో పనిచేశారు..1996లో కమాండర్ సుజాతక్క బయటికి వచ్చారు. ఆమెకు రూ. 25లక్షల రివార్డు అందిస్తామన్నారు. మావోయిస్టులు జీవజీవన స్రవంతిలోకి రావాలని ఆహ్వానిస్తున్నాము. మావోయిస్టులు చాలా మంది లొంగిపోతున్నారని జితేందర్ తెలిపారు.



