లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
రోడ్డు దాటుతుండగా ఘటన
ఆరవయ్యపల్లి గ్రామంలో విషాదం
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు
కాకతీయ, నల్లబెల్లి : లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన బుధవారం నల్లబెల్లి మండలం అరవయ్యపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆరవయ్యపల్లి గ్రామానికి చెందిన బసవరాజు కుమారస్వామి (65) రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారస్వామి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆరవయ్యపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


