epaper
Monday, March 2, 2026
epaper

రెండేళ్లుగా మల్లంపల్లి మండలం కాగితాల మీదే

రెండేళ్లుగా మల్లంపల్లి మండలం కాగితాల మీదే
బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు

కాకతీయ, ములుగు ప్రతినిధి: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా మల్లంపల్లి మండలాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మల్లంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ఆకాంక్ష, స్థానిక ప్రజల డిమాండ్ మేరకు కేసీఆర్ ప్రభుత్వం మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసింది అని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లు గడిచినా ఈ మండలం ఇప్పటికీ కాగితాల మీదే ఉన్నది అని, మండల నిర్మాణంలో తీవ్రమైన నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ ఇన్చార్జ్ ఎమ్మార్వో ఉన్నాడు అని,రిజిస్ట్రేషన్ కూడా ములుగు మీదే జరుగుతోంది అని,
పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాలేదు అని అన్నారు. మండలం ఉన్నా, సేవలు లేవు అని, ప్రజలు రోజూ ములుగుకే వెళ్లాల్సి వస్తోంది అని, ఇది ప్రజలను మోసం చేయడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేవ్‌నగర్–మల్లంపల్లి రెండు మాత్రమే సెంటర్లు ఉండటంతో మహమ్మద్ గౌస్‌పల్లి వంటి గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వెంటనే అవసరమైన సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి, జిల్లా కలెక్టర్‌లను కోరారు.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర చేస్తుంది అని, 42% బీసీ రిజర్వేషన్ ఇస్తామని మాట ఇచ్చి అమలు చేయకముందే ఎన్నికలకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గంపై కుట్ర చేస్తోంది అని ఆరోపించారు. బీఆర్ఎస్ మాత్రమే బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చిన పార్టీ అని, గత జడ్పీ ఎన్నికల్లో జనరల్ సీటులో బీసీ నాయకుడు కుసుమ జగదీష్ ని చైర్మన్‌గా చేశింది కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ములుగు జిల్లా అభివృద్ధి బాటలో నడుస్తుందనే భ్రమలో పడొద్దు అని, ఇక్కడ రెండు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పనిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రామప్ప దేవాలయాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం అని, మెడికల్ కాలేజ్‌ను ములుగుకు తీసుకువచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అని, కనెక్టివిటీ రోడ్లు, పర్యాటక అభివృద్ధి టీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయి అని అన్నారు. పాము కాటుకు గురైన ఏడేళ్ల బాలుడికి యాంటీవెనం ఇంజెక్షన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇది ఎంత దారుణం? మంత్రి ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టిన డయాలసిస్ యూనిట్లు, మొబైల్ హెల్త్ సపోర్ట్ ఇంకా పనిచేస్తున్నాయన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, మల్లంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు చీదర్ల సంతోష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, మాజీ సర్పంచ్ చంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img