కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీజేపీ మహారాష్ట్ర గవర్నర్ సీపీ. రాధాక్రిష్ణన్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్టీ నుంచి ఎంపికను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేత్రుత్వంలో జరిగిన కీలక సమావేశం తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా..సీపీ రాధాక్రిష్ణన్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. కేంద్రమంత్రి జితన్ రామ్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాక్రిష్ణన్ మేం పూర్తిగా మద్దతిస్తున్నామని కేంద్రమంత్రి జితన్ రామ్ తెలిపారు.


