కాకతీయ, మహబూబాబాద్: అమ్మాయి కోసం ఇద్దరు యువకులు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. కత్తులు, కొడవళ్లతో హల్చల్ చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ పట్టణంలో జరిగింది. అమ్మాయి కోసం ఇద్దరు యువకుల మధ్య షురూ అయిన గొడవ కత్తులు, కొడవళ్లతో దాడికి దిగేంత వరకు వెళ్లింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బయ్యారం మండలానికి చెందిన ఓ వర్గం యువకులు మహబూబాబాద్ పట్టణానికి చెందిన మరో వర్గం యువకులపై కత్తులతో దాడికి చేశారు. ప్రియురాలి కోసం ఇద్దరు యువకుల మధ్య మొదలైన గొడవ కత్తులతో దాడికి దిగే స్థాయి వరకు వెళ్లింది. ఇరువర్గాల యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు అడ్డుకోవడంతో ఓ వర్గం యువకులు కారులోనే కత్తులు వదిలి అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న బ్యాచ్ కోసం గాలింపు చేపట్టారు. యువకుల మధ్య ఘర్షణకు కారణమైన అమ్మాయి ఎవరు..గొడవకు కారణాలేంటీ అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


