epaper
Tuesday, April 7, 2026
epaper

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు ఊపిరితిత్తులు

శంషాబాద్ టు కిమ్స్ ఆసుపత్రి
గ్రీన్ ఛానెల్ ద్వారా తరలింపు
ప్రాణదాతగా మారిన ట్రాఫిక్ విభాగం
పోలీసుల ప‌నితీరుపై స‌ర్వ‌త్ర ప్ర‌శంస‌లు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బెంగళూరు నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అత్యవసరంగా ఊపిరితిత్తులను తరలించేందుకు హైదరాబాద్ పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆసుపత్రి వరకు ఉన్న భారీ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ.. ప్రత్యేక అంబులెన్స్‌కు మార్గం సుగమం చేశారు. డాక్టర్ల బృందం సకాలంలో అవయవాలను ఆసుపత్రికి చేర్చడంతో.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి శస్త్రచికిత్స చేసేందుకు వీలు కలిగింది. పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి కీలకంగా వ్యవహరించారు . బెంగళూరులో సేకరించిన ఊపిరితిత్తులను అత్యవసర చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. సాధారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే భారీ ట్రాఫిక్ కారణంగా గంటల సమయం పడుతుంది. కానీ.. అవయవ మార్పిడి చికిత్సలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది కావడంతో డాక్టర్లు వెంటనే నగర ట్రాఫిక్ పోలీసుల సహాయాన్ని కోరారు.

తక్షణమే స్పందించిన ట్రాఫిక్ విభాగం

దీంతో తక్షణమే స్పందించిన హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పోలీసులు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు దాదాపు 35 కిలోమీటర్ల మేర ‘గ్రీన్ ఛానెల్ ‘ ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న డాక్టర్ల బృందం.. మధ్యాహ్నం సమయంలో ఊపిరితిత్తులను ప్రత్యేక అంబులెన్స్‌లోకి మార్చింది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అంబులెన్స్ వెళ్లే దారిలో ఉన్న అన్ని ట్రాఫిక్ సిగ్నళ్లను ఆపివేసి.. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో అంబులెన్స్ వాయు వేగంతో సురక్షితంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. ఈ గ్రీన్ ఛానెల్ ఏర్పాటు కేసం సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పనిచేశారు. ఊపిరితిత్తులు సకాలంలో ఆసుపత్రికి చేరడంతో కిమ్స్ డాక్టర్లు వెంటనే శస్త్రచికిత్సను ప్రారంభించారు. ఈ తరలింపు సాఫీగా సాగేలా పైలట్ వాహనాలు అంబులెన్స్‌కు ముందు వెనకా ఏర్పాటు చేశారు.

గ‌తంలోనూ ప‌లుమార్లు..

గుండె, కాలేయం వంటి అవయవాలను తరలించేందుకు పోలీసులు ఇలాంటి గ్రీన్ ఛానెల్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా.. అత్యవసర వైద్య సేవల కోసం పోలీసులు చూపుతున్న ఈ చొరవను నగరవాసులు, రోగి బంధువులు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో మానవత్వాన్ని చాటుకున్న పోలీసుల కృషి వల్ల ఒక నిండు ప్రాణం నిలబడబోతోందని డాక్టర్లు తెలుపుతున్నారు. ఈ రకమైన వేగవంతమైన రవాణా వ్యవస్థలు అవయవ దాన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! మారీచులపై టీజీఎండీసీ ఎండీ స్పంద‌న‌ బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క్వారీ-2 అక్ర‌మాల‌పై ఎంక్వ‌యిరీకి భ‌వేశ్‌మిశ్రా...

బాసర ఆలయానికి మహర్దశ

బాసర ఆలయానికి మహర్దశ శృంగేరి పీఠం నుంచి అనుమ‌తులు వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా...

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి

బాసర ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ది ప‌నుల్లో రాజీ ప‌డొద్దు టీటీడీ త‌ర‌హాలో ఏర్పాట్లు...

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం అడ్డంకులు తమవారికే కొలువులు...

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానం హ్యామ్ మోడల్ రోడ్లకు రూ. 13 వేల...

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి?

సీఐడీ ఎంక్వైరీతో లాభ‌మేంటి? మంత్రిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందా? పొంగులేటి మంత్రి పదవికి...

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన క‌లిగి ఉండాలి అల్లు అర్జున్ ఫ్యాన్స్ సామాజిక సేవ...

ఆత్మీయ అనుబంధాలు మాయం

ఆత్మీయ అనుబంధాలు మాయం మనుషుల మధ్య పెరుగుతున్న వైష‌మ్యాలు ప్రేమానురాగాల కంటే సంపాదనపైనే మోజు ఉమ్మ‌డి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img