epaper
Monday, March 2, 2026
epaper

కట్న దాహానికి బలైన ప్రేమ వివాహం

కట్న దాహానికి బలైన ప్రేమ వివాహం
అత్తింటి వేధింపులకు వివాహిత బలవన్మరణం
పెళ్లైన నెలలోనే వేధింపుల ప్రారంభం
లక్ష రూపాయలు ఇచ్చినా తగ్గని చిత్రహింసలు
ఆసుపత్రిలోనూ అవమానాలు.. మనస్తాపం
సోదరుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడిన మమత
భర్తతో పాటు అత్తింటి వారిపై కేసు నమోదు

కాకతీయ, కరీంనగర్ : కట్న వేధింపులు తట్టుకోలేక ప్రేమ వివాహం చేసుకున్న ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో పాటు అత్తింటి సభ్యులు నిరంతరం కట్నం కోసం వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వివాహిత చివరకు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.

పెళ్లైన నెలలోనే కట్న వేధింపులు
కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29) తన బంధువైన తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్‌ను సుమారు 14 నెలల క్రితం ప్రేమించి వివాహం చేసుకుంది. గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లిలో కొంతకాలం నివాసం ఉన్న ఈ దంపతులు అనంతరం గంగానగర్‌లో అద్దె ఇంటికి మారారు.
ప్రేమ వివాహం జరిగిన నెల రోజులకే భర్త నరేష్‌తో పాటు అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు లింగంపల్లి కవితలు కట్నం కోసం మమతను మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వేధింపులు అధికమవడంతో మమత తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. దీంతో రెండు నెలల క్రితం ఆమె సోదరుడు మహేష్ ద్వారా రూ. లక్ష నగదు ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆసుపత్రిలోనూ తప్పని అవమానాలు
ఈ నెల 16న మమత తన సోదరుడు మహేష్‌కు ఫోన్ చేసి అత్తింటి వారు తీవ్రంగా వేధిస్తున్నారని, ప్రాణహాని ఉందని తెలిపింది. అనంతరం కుటుంబ సభ్యుల సహాయంతో ఆమెను మంచిర్యాల సమీపంలోని నస్పూర్ కాలనీకి తరలించారు. అయితే భర్త నరేష్ అనారోగ్యంతో ఇంటి వద్ద పడిపోవడంతో మమత అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని మెడికోవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో కూడా అత్తింటి సభ్యులు “నీ వల్లే మా కొడుకు పరిస్థితి ఇలా అయింది” అంటూ మమతను తీవ్రంగా అవమానించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మమత మంగళవారం ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లింది.

సోదరుడికి ఫోన్ చేసి ప్రాణాలు తీసుకున్న వివాహిత
మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో మమత తన సోదరుడు మహేష్‌కు ఫోన్ చేసి అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నానని, తాను ప్రాణాలు తీసుకుంటున్నానని తెలిపింది. వెంటనే మహేష్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మమత ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి తీగలగుట్టపల్లిలోని హనుమాన్‌నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే సరికి మమత ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.

భర్త, అత్తింటి వారిపై కేసు నమోదు
మృతురాలి తండ్రి లింగంపల్లి పోషం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త నరేష్‌తో పాటు అత్త చిన్నక్క, మామ భూమయ్య, ఆడపడుచు కవితపై కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఘటనాస్థలాన్ని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి సోహం సునీల్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ పరిశీలించారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రేమ వివాహం కట్న వేధింపులతో విషాదాంతానికి దారితీసిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img