epaper
Thursday, January 15, 2026
epaper

స్థానిక ఎన్నికలు … ఇజ్జత్ కా సవాల్‌..

  • పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే
    బీజేపీని గెలిపిస్తేనే గ్రామాలకు నిధులు
    ఎమ్మెల్యేకు ఫండ్స్ లేవు, పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇయ్యడం లేదు
    పంచాయతీలకు బీఆర్ఎస్ చేసిన మోసం అంతా ఇంతా కాదు
    ప్రతి ఇంటికీ 3 సార్లు వెళ్లి ప్రచారం చేయండి
    కాషాయ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు నుండి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఇజ్జత్ కా సవాల్ గా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. ఆయా నేతలు నివసించే గ్రామాలు, మండలాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఆయా నాయకులకు పతారా ఉంటుందని, తనను ఎంపీగా గెలిపించింది కార్యకర్తలేనని, స్థానిక సంస్థల్లో వారిని గెలిపించేందుకు అన్ని విధాలా క్రుషి చేస్తానన్నారు.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బండి సంజయ్ కుమార్ గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫ‌రెన్స్ లో క‌రీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల ఇంచార్జీలు గంగిడి మనోహర్ రెడ్డి, శాంతికుమార్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపీ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం కావాలి

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సర్వేలు అన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, స్థానిక ఎన్నిక‌ల‌కు బీజేపీ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. టిక్కెట్ల ఎంపికలో రాష్ట్ర నాయకత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని, నేను అభిప్రాయం చెప్పొచ్చు కానీ, అది ఫైనల్ కాదని గెలుపు సాధ్యమయ్యే అభ్యర్థులనే పార్టీ ప్రకటిస్తుందని బండి స్పష్టం చేశారు. నామినేషన్లు వేసేందుకు నేతలు కావలసిన అన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నాకు గ్రూపులు లేవు, నాది బీజేపీ గ్రూపే పార్టీ అని అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం కన్నతల్లికి ద్రోహం చేసినట్టే అని వ్యాఖ్యానించిన బండి సంజయ్, పార్టీ శ్రేణుల మధ్య ఐక్యతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఏకైక ఎంపీగా నేనే ..

ప్రతి గ్రామానికి రూ.5 నుండి రూ.20 లక్షల వరకు నిధులు విడుదల చేసిన ఏకైక ఎంపీగా నేనే అని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్, జాతీయ ఉపాధి హామీ పథకాల కింద కేంద్ర నిధులతోనే రోడ్లు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బండి సంజ‌య్ వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నయాపైసా నిధి లేదని, బీఆర్ఎస్ పల్లెలకు చేసిన మోసాలు మరువలేమ‌ని, కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాలను నిర్వీర్యం చేశారన్నారు. అటువంటి పార్టీకి ఓటేసిన‌ ప్రజలకు ఏమి ప్రయోజనం?” అని బండి ప్రశ్నించారు.

ప్రచారానికి పూర్తి సమయం కేటాయిస్తా.

ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా కష్టపడ్డారో గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు రెట్టింపు శ్రమ చేయాలి. నేను కూడా పూర్తిగా ప్రచారానికి సమయం కేటాయిస్తాను అని కార్యకర్తలను బండి సంజ‌య్ తెలిపారు. ప్ర‌తి ఇంటికీ కనీసం మూడు సార్లు వెళ్లి బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలంటూ ప్రజలను కోరాలని సూచించారు. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విరక్తి పెరిగిందని, బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ గెలుపున‌కు కృషి చేయాలని సంజ‌య్ సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img