బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు
కాకతీయ, మల్కాజిగిరి : మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువులో నివాసం ఉంటున్న ఆర్యన్ గౌస్ అంకుర్ గౌస్ కుమారుడు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం సహాయం అవసరమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో అక్షరాల రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి-బ్లాక్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్, మల్కాజ్గిరి వర్కింగ్ ప్రెసిడెంట్ బి.కే. శీను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ & మీడియా కన్వీనర్ నిరంజన్, సీనియర్ లీడర్ కపిల్, గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు వైనాల ప్రవీణ్ కుమార్, బాలరాజు యాదవ్, ధరన్, కుట్టి శీనన్న, జాన్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.


