పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
కాకతీయ, పెద్దవంగర : పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పక వేయించాలని సర్పంచ్ ముత్తినేని యాకాలక్షిసోమన్న, పశువైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ అన్నారు. శనివారం గట్లకుంట గ్రామంలో ఉచిత గాలికుంటు నివారణ టీకాల వేసి మాట్లాడారు. రైతులకు ఆర్థికంగా నష్టం చేసే వ్యాధులలో ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి అన్నారు. ఈ వ్యాధి వస్తే చూడి పశువులకు అబార్షన్ అయ్యే అవకాశం ఉందని, పాడి పశువులు అధిక జ్వరంతో బాధపడుతూ, ఎద్దులు దుక్కి దున్నే సామర్థ్యాన్ని కోల్పోతాయన్నారు. ఈ వ్యాధి నివారణ టీకాలతో పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ అస్సాన్, గోపాలమిత్ర సూపర్వైజర్ అనిల్ రావు, బండి శేఖర్ ,వెంకన్న, రైతులు కుమార్, మహేష్ తదితరు పాల్గొన్నారు.


