epaper
Monday, March 2, 2026
epaper

భారత్‌కు నీరవ్‌మోదీ అప్పగింతకు లైన్ క్లియర్.!!

కాకతీయ, నేషనల్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను వేల కోట్లు మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అతన్ని భారత్ కు రప్పించేందుకు మార్గం సుగుమమైందని తెలుస్తోంది. నవంబర్ 23న నీరవ్ ను భారత అధికారులకు అప్పగించే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు అప్పగింత ప్రక్రియకు సంబంధించి ఇటీవల ఓ హామీ పత్రాన్ని కూడా సమర్పించింది. నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చిన తర్వాత కేవలం మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారణ జరుపుతామని ఇతర కస్టడీకి అప్పగించబోమని ఆ పత్రంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ , కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందించాయి. భారత్ కు అప్పగించిన తర్వాత నీరవ్ మోదీని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచుతారని..హై ప్రొఫైల్ ఖైదీలకు లభించే అన్ని సౌకర్యాలను కల్పిస్తారని పత్రంలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ నీరవ్ మోదీ ఇటీవల మరోసారి లండన్ కోర్టును ఆశ్రయించారు. తనను భారత్ కు అప్పగిస్తే దేశంలోని అనేక విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురిచేస్తాయని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాని నీరవ్ మోదీ అభ్యర్థించారు. లండన్ కోర్టు ఈ పిటిషన్ను పరిగణలోనికి తీసుకుంది.

ఈ నేపథ్యంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించగా..దీన్ని పరిశీలించిన న్యాయస్థానం నవంబర్ 23న తదుపరి విచారణ సమయంలో అతన్ని భారత్ కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సదరు కథనాలు తెలిపాయి. తప్పుడు ఎల్ వోయూలతో పీఎన్బీని నీరవ్ మోసం చేసిన వ్యవహారం 2018 జనవరిలో వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే అప్పటికే నీరవ్ దేశం విడిచి పారిపోయారు. ఈడీ అతన్ని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.

2018 డిసెంబర్ లో నీరవ్ తమ దేశంలో నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్ కు తెలిపింది. దీంతో అతన్ని అప్పగించాలని భారత్ విజ్నాప్తి చేసింది. 2019 మార్చిలో నీరవ్ అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతన్ని భారత్ కు అప్పగించడాన్నికి 2021లో నాటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నీరవ్ లండన్ హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికీ కోర్టు దాన్ని తిరస్కరించింది. బెయిల్ కోసం చాలా సార్లు దరఖాస్తు చేసినప్పటికీ ప్రతిసారీ భంగపాటే ఎదురైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

ఖమ్మం నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం – విద్యార్థిపై దాడి

నారాయణ హాస్టల్‌లో డ్రగ్స్ కలకలం మత్తులో ఇద్దరు విద్యార్థుల దాడి… ఇంటర్ విద్యార్థి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img