- కాంగ్రెస్ మోసపూరిత పాలనపై ప్రజలకు వివరించాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
కాకతీయ, కరీంనగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మంగళ వారం బీజేపీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
వాటిపై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ అధికారం లోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పాలన పై ప్రజలకు వివరించాలని, అలాగే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడానికి బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కరీంనగర్ కు వస్తున్నారని ఆయన తెలిపారు.


