epaper
Thursday, March 5, 2026
epaper

బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం

బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిద్దాం
మన గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందాం
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

కాకతీయ, వరంగల్ సిటీ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసి చివరకు 17 శాతం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ బీసీల‌ను వంచ‌న‌కు గురి చేసింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి బీసీ ఓట‌ర్లు బ్యాలెట్‌తో స‌మాధానం చెప్పాల‌ని అన్నారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేయడానికి, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మెజారిటీ పంచాయతీలను గెలిపించుకోవాల‌ని గంట రవికుమార్ పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మంగళవారం హ‌సన్ పర్తి మండల పరిధిలోని జయగిరి, మడిపల్లి, ఐనవోలు మండలలోని పంతిని, నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామల సర్పంచ్, వార్డు మెంబర్లుగా అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయించారు. ఈసంద‌ర్భంగా ర‌వికుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమని అన్నారు. అందుకే వరంగల్ జిల్లా బీజేపీ సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. గ్రామ వార్డు మెంబర్ స్థాయి నుంచి జ‌డ్పీటీసీ వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను (మహాలక్ష్మి, రైతు భరోసా వంటివి) అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ప్ర‌చారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, పార్లమెంట్ కన్వీనర్ తాళ్ళపెల్లి కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, గడల కుమార్, రేసు శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, జిల్లా కార్యదర్శి జడ సతీష్, రాధాకృష్ణ, అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు, హాసన్ పర్తి మండల అధ్యక్షులు మారం తిరుపతి, తడక వినయ్, గూడూరు సందీప్, టి.అంబేద్కర్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు నాడు ఎడ్ల బండ్లు… నేడు వాహనాల ర‌ద్దీ జిగేల్‌మనే...

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం

వైభవంగా మల్లికార్జునస్వామి కళ్యాణం కాకతీయ, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లె...

రోడ్డు పనులు పూర్తి చేయాలి

రోడ్డు పనులు పూర్తి చేయాలి కాకతీయ, మరిపెడ : మున్సిపాలిటీ పరిధిలోని కొండ...

పన్నుల చెల్లింపుపై

పన్నుల చెల్లింపుపై వడ్డీ మాఫీ ఉండదు ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను...

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది...

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు

తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు...

ఘ‌నంగా హోలీ

ఘ‌నంగా హోలీ కాకతీయ, మరిపెడ: హోలీ వేడుక‌ల‌ను బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో...

ర్యాగింగ్ ఘటనపై

ర్యాగింగ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి కాకతీయ, మరిపెడ : మరిపెడ మండలంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img