epaper
Thursday, January 15, 2026
epaper

సమర్థులకే నాయకత్వం

  • అభిప్రాయాల ఆధారంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక
  • ఏఐసీసీ పరిశీలకుడు మానే శ్రీనివాస్

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపికకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ పథకం కింద, కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకత్వాన్ని పారదర్శకంగా ఎంపిక చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మంగళవారం ఎల్ఎండీ కాలనీలోని అరుంధతీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు మానే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థులకే పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్నదే అధిష్ఠానం ఉద్దేశమని అన్నారు.

గ్రామస్థాయిలో పార్టీ పటిష్ఠత కోసం జిల్లా అధ్యక్షుడి పాత్ర కీలకమైనదని, అందువల్ల కార్యకర్తల అభిప్రాయమే నిర్ణయాత్మకంగా మారుతుందన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో నిబద్ధతతో పని చేసినవారిని ఎప్పటికీ గుర్తించి గౌరవిస్తుందని తెలిపారు. నాయకుల విజయాల వెనుక కార్యకర్తల కృషి ఉంటుందనీ, పార్టీ పట్ల అవిశ్రాంతంగా పని చేసే కార్యకర్తలే నిజమైన బలమన్నారు. వ్యక్తిగత విభేదాల కన్నా పార్టీ పటిష్ఠతకు ముంద‌డుగు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోందని, పార్టీ చరిత్రను పరిరక్షించడం మనందరిపై బాధ్యతగా ఉందని అన్నారు. నాయకత్వ ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా నియామక ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.

గంగాధర మండలంలో.

గంగాధర మండలంలోని మధురానగర్‌లో చొప్పదండి నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో మరో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుని నియామకం పై కార్యకర్తల అభిప్రాయాలను మానే శ్రీనివాస్ సేకరించారు. కార్యకర్తల అభిప్రాయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు నివేదిక రూపంలో పంపనున్నట్లు తెలిపారు. ఈ రెండు సమావేశాల్లో టీపీసీసీ ప్రతినిధులు చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, బ్లాక్, మండల అధ్యక్షులు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, ఒగ్గు దామోదర్, నందగిరి రవీంద్రచారి, గోపగోని బస్వయ్యగౌడ్, బండారి రమేశ్, ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిళా నాయకులు కర్ర సత్య ప్రసన్నా రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img