epaper
Thursday, January 15, 2026
epaper

అధికార పార్టీలో టికెట్లకు నేతల ఆరాటం

అధికార పార్టీలో టికెట్లకు నేతల ఆరాటం
ఒక్కో వార్డులో ఐదుగురికి పైగా ఆశావహులు
కోర్ కమిటీ వద్దకు దరఖాస్తుల వెల్లువ
స్వతంత్రంగా పోటీపై చర్చలు
రామకృష్ణాపూర్ మున్సిపల్‌లో వేడెక్కిన రాజ‌కీయం

కాకతీయ, రామకృష్ణాపూర్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం నేతల ఆరాటం మొదలైంది. 22 వార్డుల పరిధిలో అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఒక్కో వార్డులో ఐదుగురికి పైగా ఆశావహులు ముందుకు రావడంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పట్టణ కోర్ కమిటీకి టికెట్ల కోసం నేతలు వరుసగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీ కార్యాలయంలో కోర్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రకారం ఆశావహుల వివరాలను కమిటీ సభ్యులు సేకరించారు. పాత నాయకులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల కలయికతో కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది తప్పడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆశావహుల సంఖ్య పెరగడం, టికెట్ల కేటాయింపులో సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాత నాయకులకే అవకాశాలు ఇవ్వాలంటూ కొందరు నేతలు కోర్ కమిటీపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమావేశంలో నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకున్నట్లు సమాచారం. టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలన్న ఆలోచనలో కొందరు ఉన్నట్లు చర్చ సాగుతోంది. అదే జరిగితే అధికార పార్టీ కాంగ్రెస్‌కు నష్టం తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రిజర్వేషన్లపై స్వల్ప మార్పుల యోచన

రిజర్వేషన్ల అంశంలో స్వల్ప మార్పులు చేయాలన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే వ్యూహాలపై కూడా నేతలు చర్చించినట్లు సమాచారం. చివరకు టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌కు ఎంతవరకు అనుకూలత వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు దఫాలుగా సర్వేలు పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ, ఇప్పుడు పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహించడంపై నేతల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు వార్డుల కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడంపై కోర్ కమిటీ సభ్యులపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్థానిక నేతలు విఫలమయ్యారని, సోషల్ మీడియాలోనూ పార్టీకి కావాల్సినంత వేగం లేదన్న అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. చివరగా పార్టీ గెలుపు, అభ్యర్థుల విజయం కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img