epaper
Sunday, March 1, 2026
epaper

గత ఏడాది ఫలితాలను మళ్లీ సాధించాలి

గత ఏడాది ఫలితాలను మళ్లీ సాధించాలి
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
45 కేంద్రాల్లో 8,154 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం
పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు
మ‌హ‌బూబాబాద్ డీఈఓ రాజేశ్వర్

కాకతీయ, మహబూబాబాద్ ప్ర‌తినిధి : జిల్లాలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి. రాజేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సిఎస్‌లు, డివోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఏడాది సాధించిన ఉత్తీర్ణత శాతాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించేలా కృషి చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన మొత్తం 8,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, శుభ్రత, విద్యుత్ సదుపాయం, సీసీ కెమెరాలు, టాయిలెట్లు, డ్యూయల్ బెంచీలు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

భద్రతా చర్యలు కట్టుదిట్టం.. సెక్షన్ 144 అమలు

ప్రశ్నాపత్రాల రవాణా, భద్రత, సీలింగ్ ప్రక్రియలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు జిరాక్స్ కేంద్రాలను పూర్తిగా మూసివేయనున్నట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పరీక్షల నిర్వహణలో పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులకు టైమ్‌టేబుల్‌పై పూర్తి అవగాహన కల్పించాలని, ఎవరూ పరీక్షలకు గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, డీఎస్ఓ అప్పారావు, డిసిఇబి కార్యదర్శి బాలాజీ, మండల విద్యాశాఖ అధికారులు, సిఎస్‌లు, డివోలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..!

ఓబీసీ సాధనమే మా లక్ష్యం..! ఆరె కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి చట్టసభల్లో ప్రాతినిధ్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img