epaper
Monday, March 2, 2026
epaper

బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్.. నేడు, రేపు ధర్నాలకు పిలుపు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిగ్గా మారింది. కాళేశ్వరం రిపోర్టుపై రాష్ట్ర శాసనసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బహిర్గతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు, రేపు బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని సూచించారు.

కేటీఆర్ సూచనల మేరకు మండల కేంద్రాల నుంచి జిల్లా ప్రధాన కేంద్రాల వరకు పార్టీ కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీల రూపంలో నిరసనలు చేపట్టనున్నారు. ప్రజల్లోకి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని చేస్తున్న రాజకీయాలను బహిర్గతం చేయాలని కేటీఆర్ ఆదేశించారు.

కాంగ్రెస్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కేటీఆర్, ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి మూలస్థంభాలుగా నిలుస్తాయని, అలాంటి ప్రాజెక్టులను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ వర్గాల ప్రకారం, ఈ ఆందోళనల ద్వారా బీఆర్ఎస్ ప్రజల్లో కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సందేశం బలంగా చేరేలా వ్యూహరచన చేపడుతోంది. మొత్తానికి, కేటీఆర్ పిలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు వీధుల్లోకి దిగితే, కాళేశ్వరం అంశం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కడం ఖాయమని చెప్పవచ్చు.

అటు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హరీశ్ రావు తరపున న్యాయవాది అత్యవసర పిటిషన్ కింద విచారణ చేపట్టాలంటూ కోరారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందంటూ కోర్టుకు తెలిపారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామని కోర్టుకు ఏజీ తెలిపారు అన్నారు. అసెంబ్లీలో తీర్మానించకుండానే సిబిఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రేపటి వరకు తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. దీనిపై పదే పదే హరీశ్ రావు తరపు న్యాయవాది అభ్యర్థించినా కోర్టు అంగీకరించలేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img