కాకతీయ, ఖానాపురం : ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ లంబాడీ జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఖానాపురం లంబాడీ మండల జేఏసీ కన్వీనర్ గుగులోతు కిషన్ నాయక్, ముఖ్య సలహాదారులు జాటోత్ బాలు నాయక్, బాదావత్ బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు అన్నదమ్ముల్ల కలిసి మెలిసి ఉన్న ఎస్టి కులాల మధ్య విభేదాలను సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుందని, దీనిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కొత్తూరు గ్రామ లంబాడీ జేఏసీ నూతన కమిటీ అధ్యక్షుడిగా జాటోత్ రాజేందర్ నాయక్, ఉపాధ్యక్షుడిగా జాటోత్ భద్రు నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు జాటోత్ యాకూబ్ నాయక్, జాటోత్ వాసురాం నాయక్, కో కన్వీనర్ జాటోత్ కిషన్ నాయక్, అజ్మీర శ్రీను నాయక్, జాటోత్ రాజ్ కుమార్ నాయక్, అంగోత్ అశోక్ నాయక్, జాటోత్ జోహార్ లాల్ నాయక్, జాటోత్ ఎల్లయ్య నాయక్, జాటోత్ రాజు నాయక్, అజ్మీర రాజు నాయక్, నరసింహ నాయక్, రాజు నాయక్, జాటోత్ గోవిందు నాయక్, జాటోత్ రవీందర్ నాయక్, లావుడియా కుమార్ స్వామి నాయక్, తండా వాసులు పాల్గొన్నారు.


