ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం
కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండి
కాకతీయ, గీసుగొండ : కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, కొమ్మాల గుట్ట జాతర సందర్భంగా ఏర్పాటు చేయనున్న ప్రభ బండి ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావును జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. మండలంలో జరగనున్న జాతర వేడుకల్లో భాగంగా కొండా వర్గీయులు ప్రత్యేకంగా ప్రభ బండిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కొండాను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లం బాలకిషోర్ రెడ్డి, రడం భరత్ కుమార్, వీరగోని రాజ్ కుమార్ తదితర మండల నాయకులు పాల్గొన్నారు.


