epaper
Wednesday, March 11, 2026
epaper

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం

వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం
ప్రభుత్వ గడువుకు ముందే పట్టాల పంపిణీ
మంత్రుల చొరవతో వెలుగుమ‌ట్ల‌ సమస్యకు పరిష్కారం
ఖ‌మ్మం డీసీసీ అధ్య‌క్షుడు నూతి సత్యనారాయణ గౌడ్

కాకతీయ, ఖమ్మం : వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితుల సమస్యకు ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ముందే పరిష్కారం లభించిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవతో వెలుగుమట్ల నిర్వాసితులకు చట్టబద్ధత కల్పించారని ఆయన పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలకు న్యాయం చేసిన నిజమైన ప్రజా ప్రభుత్వం ఇదేనని అన్నారు.

అర్హులైన కుటుంబాలకు ఇంటి స్థలాలు

వెలుగుమట్ల భూదాన్ బాధితుల సమస్యను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. అధికారులను అప్రమత్తం చేసి ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించారని చెప్పారు. ఆ సర్వేలో మొత్తం నాలుగు వందల పన్నెండు కుటుంబాలను నిజమైన నిరుపేదలుగా గుర్తించినట్లు తెలిపారు. అందులో మూడు వందల పదకొండు కుటుంబాలకు ఇంటి స్థలం పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయగా, ఇప్పటికే ఇంటి స్థలం ఉన్న నూట ఒకటి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మొత్తం నాలుగు వందల పన్నెండు కుటుంబాలకు శాశ్వత గృహ యోగం కలగబోతుందని అన్నారు. పేదల రక్తం తాగే దళారి వ్యవస్థపై జిల్లా మంత్రులు ఉక్కుపాదం మోపారని ఆయన పేర్కొన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎలాంటి లంచాలకు తావులేకుండా నేరుగా మంత్రులే బాధితుల చేతికి పట్టాలు అందించడం జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన గడువుకు ముందే బాధితులకు న్యాయం జరగడం హర్షణీయమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..!

డబ్బులు ఇస్తేనే పట్టా పాస్‌బుక్..! దళారుల ద్వారా డబ్బుల వసూళ్లు ఎకరానికి 25...

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే

ప్రగతి విద్యాలయంలో ఘనంగా ఫేర్వెల్ డే ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులు కాకతీయ, కూసుమంచి:...

చిన్నారులకు పాదరక్షల పంపిణీ

చిన్నారులకు పాదరక్షల పంపిణీ కోయగట్టు అంగన్వాడిలో సేవా కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు చెప్పులు అందజేత కాకతీయ...

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి కూసుమంచి మండలంలో అమానుష ఘటన ఫోక్సో చట్టం కింద...

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..!

కూల్చిన చోటే పట్టాల పంపిణీ..! భూదాన్ భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు వెలుగుమట్ల భూదాన్...

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌ పున‌రావృతం కాకుండా...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

 గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ చందుర్తి మండలం మర్రిగడ్డ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img