హుస్సేన్ నాయక్ కు జర్నలిస్టులు నాయకులు పరామర్శ
కాకతీయ నెల్లికుదురు/ ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి ఇటీవల పరమపదించారు. నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్ గ్రామానికి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణ దాత, గేయిల్ కంపెనీ మేనేజర్ రాజన్న నాయక్, సీనియర్ జర్నలిస్టులు పంజాల వాసుదేవ్ గౌడ్, బొలగాని యాకన్న గౌడ్, ఇనుగుర్తి మండలం మీట్యా తండా కు చెందిన బిజెపి జిల్లా నాయకులు గుగులోతు నవీన్ నాయక్,సీనియర్ నాయకులు బాలు నాయక్ లు ఆదివారం హుస్సేన్ నాయక్ స్వగృహం గూడూరు మండలం మచ్చర్ల గ్రామంలోని తావూరియా తండాకు వెళ్లి స్వర్గీయ లచ్చా నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హుస్సేన్ నాయక్ తో పాటు ఆయన సోదరుడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


