epaper
Wednesday, January 21, 2026
epaper

డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం!

డిఫాల్ట్ మిల్లర్లపై జీవో అస్త్రం!
తేల‌నున్న పెండింగ్ సీఎంఆర్‌ లెక్క‌
90 రోజుల గ‌డువుతో మిల్ల‌ర్ల‌కు అల్టిమేటం
సీఏంఆర్ బకాయిల రికవరీపై ఫుల్ ఫోకస్
కాక‌తీయ క‌థ‌నాల‌తో క‌దులుతున్న‌ యంత్రాంగం

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : డిఫాల్ట్ రైస్ మిల్లర్ల పెండింగ్ సీఏంఆర్ బకాయిల రికవరీకి సివిల్ సప్లయ్ శాఖ గట్టిగా నడుం బిగించింది. పేదల బియ్యం మాయం, కరీంనగర్ జిల్లాలో సీఏంఆర్ స్కామ్ అంటూ ఇటీవల వెలువడిన కథనాలతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా యాక్టివ్ అయ్యింది. ఇప్పటివరకు నామమాత్రంగా సాగిన చర్యలకు బ్రేక్ వేస్తూ, తాజాగా జారీ చేసిన జీవోను ఆయుధంగా మార్చుకుని డిఫాల్ట్ మిల్లర్లపై దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్, జిల్లా అధికారులు సమన్వయంతో రికవరీ డ్రైవ్ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో 2012–13 నుంచి 2023–24 వరకు ప్రభుత్వానికి అందాల్సిన సీఏంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) బియ్యం భారీగా పెండింగ్‌లోనే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 35,563 మెట్రిక్ టన్నుల బియ్యం డిఫాల్ట్‌గా నమోదై ఉండగా, ప్రస్తుత ధరల ప్రకారం దాని విలువ రూ.137 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇంతకాలం డిఫాల్ట్‌లు కొనసాగినా కఠిన చర్యలు లేకపోవడం వెనుక అధికారుల అండదండలున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా జీవో అమలు నిజంగా రికవరీకి దారి తీస్తుందా? లేక మరోసారి కాగితాలకే పరిమితమవుతుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.

సీఏంఆర్ బకాయిలపై జీవో కొరడా

సీఏంఆర్ బకాయిల నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & సివిల్ సప్లయ్ శాఖ 24-11-2025న మెమో నెం.2809 / సీఎస్.ఐ–సీసీఎస్ / 2025ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం కేఎంఎస్ 2014–15 నుంచి 2023–24 వరకు డిఫాల్ట్ అయిన మిల్లర్లు అసలు సీఏంఆర్ మొత్తంతో పాటు 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ కలిపి మొత్తం 125 శాతం విలువ చెల్లించాలి. నగదు గానీ, సన్నబియ్యం రూపంలో గానీ బకాయిలు తీర్చేందుకు కేవలం 90 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. ఈ గడువులోపే పూర్తి చెల్లింపులు చేసిన మిల్లర్లకే భవిష్యత్తులో తాజా వరి అలాట్ చేయాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. జీవో అమలులో భాగంగా జిల్లా సివిల్ సప్లయ్ అధికారి ఆధ్వర్యంలో డిఫాల్ట్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సుమారు 22 మంది డిఫాల్ట్ మిల్లర్లను పిలిచినా, అర్ధహాజరే కనిపించడంతో అధికారుల్లో అసహనం వ్యక్తమైంది. జీవో నిబంధనలపై కౌన్సిలింగ్ ఇచ్చినా, మిల్లర్ల నిర్లక్ష్య ధోరణి అధికారులను మరింత అప్రమత్తం చేసినట్లు సమాచారం.

కఠిన చర్యల వైపు జిల్లా యంత్రాంగం

ఈసారి బకాయిల రికవరీలో వెనుకడుగు లేదన్న సంకేతాలు జిల్లా యంత్రాంగం నుంచి వస్తున్నాయి. డిఫాల్ట్ మిల్లర్లతో మరో కీలక సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హాజరు కాకపోతే లైసెన్సుల రద్దు, ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 19 రైస్ మిల్లులు డిఫాల్ట్‌గా ఉండగా, అధికారికంగా 22 డిఫాల్ట్ ఎంట్రీలు నమోదయ్యాయి. కొన్ని మిల్లులు పునరావృతంగా బకాయిలు పెంచుకుంటుండటంతో పరిస్థితి తీవ్రంగా మారింది. ఇప్పటికైనా జీవో అమలుతో పేదల బియ్యం ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయా? డిఫాల్ట్ మిల్లర్లపై నిజంగా చర్యలు పడతాయా? అన్నది రాబోయే 90 రోజుల్లో తేలనుంది. తదుపరి చర్యలపై జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సీఎం హోదాలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు

సీఎం హోదాలో బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్‌ఎస్ ఫిర్యాదు శాంతి భద్రతలకు...

హుజూరాబాద్‌లో బీజేపీ సంబరాలు, ర్యాలీ

హుజూరాబాద్‌లో బీజేపీ సంబరాలు, ర్యాలీ కాకతీయ, హుజూరాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ...

శాతవాహన ఫార్మసీ విభాగాధిపతిగా డా. క్రాంతిరాజు నియామకం

శాతవాహన ఫార్మసీ విభాగాధిపతిగా డా. క్రాంతిరాజు నియామకం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

ధర్మపురి అభివృద్ధికి రూ.229 కోట్లు

ధర్మపురి అభివృద్ధికి రూ.229 కోట్లు విద్య–నీరు–సంక్షేమ రంగాలకు భారీగా నిధులు ఇంటిగ్రేటెడ్ పాఠశాల, డిగ్రీ...

మేయర్ పీఠమే టార్గెట్

మేయర్ పీఠమే టార్గెట్ క‌రీంన‌గ‌ర్‌లో పొలిటిక‌ల్ పీక్‌ మూడు పార్టీల మ‌ధ్య త్రిముఖ పోటీ...

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం

టికెట్ల ఇవ్వ‌డానికి సర్వేలే ప్రామాణికం అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు ఆశావ‌హుల మ‌ధ్య ఒప్పందం.....

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

పురపాలక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి షెడ్యూల్ విడుదలకు ఎన్నికల సంఘం సన్నాహాలు క్రిటికల్ కేంద్రాల్లో...

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం

కాంగ్రెస్–బీజేపీల వైఫల్యాలపై పోరాటం కరీంనగర్‌ను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం అభ్యర్థులు దొరకని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img