epaper
Monday, March 2, 2026
epaper

ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపేందుకే జ‌నంబాట‌

  • కేసీఆర్ ఫొటో పెట్టుకోవ‌డం నైతికం కాదు
  • తెలంగాణ తల్లి, జయశంకర్ సార్ ఫోటోలతో జ‌నంలోకి..
  • ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రతీ జిల్లాలో 2 రోజులపాటు యాత్ర‌
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వ‌ర్గం సంతృప్తిగా లేదు
  • తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌
  • జాగృతి జనంబాట యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కవిత.. తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించారు. ఈక్రమంలోనే ఇవాళ తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి జనంబాట యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. త్వరలోనే తాను చేపట్టనున్న ప్రజాయాత్రకు సంబంధించిన పలు వివరాలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తన భవిష్యత్ ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ క‌డుపున పుట్ట‌డం అదృష్టం

కేసీఆర్ గురించి మాట్లాడిన కవిత.. ఒక పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు అని.. ఆ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారని.. అందుకే ఆయన ఫోటో పెట్టుకుని యాత్ర చేయడం నైతికంగా సరైంది కాదని పేర్కొన్నారు. అందుకే కేసీఆర్ ఫోటో కాకుండా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలతో ఈ జాగృతి జనం బాట యాత్ర కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ తన తండ్రి అని.. ఆయన కడుపున పుట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. అదే సమయంలో కేసీఆర్ ఫోటోను యాత్రలో ఉంచడం తన నైతిక విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీన ప్రారంభం కానున్న ఈ యాత్ర.. ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

ప్ర‌జ‌లే గురువులు..

సామాజిక తెలంగాణ కోసం తాను అప్పుడు పోరాడానని.. ఇప్పుడు కూడా పోరాడతానని స్పష్టం చేశారు. ప్రజలే తన గురువులని.. అందుకే ప్రజల దగ్గరికి వెళ్లాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు కవిత వివరించారు. హైదరాబాద్‌లో కూర్చొని జిల్లాల్లో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడటం సరైంది కాదని.. అందుకే ప్రతీ జిల్లాలో జాగృతి జనం బాట పేరుతో 2 రోజులపాటు యాత్ర చేస్తానని తెలిపారు. నాలుగు నెలలపాటు ఈ జాగృతి జనం బాట యాత్ర కొనసాగుతుందని కవిత వివరించారు. యాత్రలో అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు చాలా తెలివైన వాళ్లని.. వారికి అన్నీ తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ యువత, మహిళలను మరింత చైతన్యవంతులను చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రంలోని ఏ వర్గం కూడా సానుకూలంగా లేదని విమర్శలు చేశారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి.. ప్రతిపక్షాలను వేధించే పనిలోనే ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని కవిత ఆరోపించారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో అనిశ్చితి వాతావరణం నెలకొందని మండిపడ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img