epaper
Monday, March 2, 2026
epaper

జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది

జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది

కాంగ్రెస్‌, బీజేపీతో ప్ర‌జ‌లు విసిగిపోయారు

బీహార్ ఫ‌లితాల‌పై ప్రశాంత్ కిషోర్ జోస్యం..

ప్రధాన పార్టీల్లో పెరిగిన టెన్షన్!

కాక‌తీయ‌, జాతీయం : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ అంచనాలు తలకిందులు చేసింది. ప్రజలు ఊహించని స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 64.66% పోలింగ్ నమోదైంది. ఈ గణాంకాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 1951లో జరిగిన తొలి ఎన్నికల తర్వాత ఇంత భారీ ఓటింగ్ జరగడం ఇదే మొదటిసారి. జన్ సురాజ్ పార్టీ అధినేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ రికార్డు పోలింగ్‌పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలపై జోస్యం చెప్పారు. “నేను కొన్ని నెలలుగా చెబుతున్న మాటే నిజమైంది. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రంలోని 60శాతం ప్రజలు కొత్త దిశలో నడవాలనుకుంటున్నారు. ఆ మార్పుకు జన్ సురాజ్ పార్టీనే ప్రత్యామ్నాయం అవుతోంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడినప్పుడు త‌మ‌ పార్టీ చరిత్ర సృష్టిస్తుంది” అని స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం ప్రకారం.. ప్రజలు సాంప్రదాయ పార్టీలకు విసిగిపోయారు. ఎన్డీఏ, ఇండియా కూటములపై ప్రజల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ఫ‌లితాల‌పై ఉత్కంఠ‌

ఆయన వ్యాఖ్యలతోనే బీహార్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్డీఏ, ఇండియా కూటమి శిబిరాల్లో టెన్షన్ మొదలైంది. ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలమవుతుందనే దానిపై మేధోమథనం ప్రారంభించాయి. ఇక‌పోతే బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడతలో 121 స్థానాలకు పోలింగ్ ముగిసింది. రెండో విడతగా 122 స్థానాలకు ఓటింగ్ మంగళవారం జరగనుంది.. ఎన్నికలు ప్రశాంతంగా సాగినప్పటికీ, ఈ భారీ ఓటింగ్ శాతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా మహిళా ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు రావడం ఈసారి కీలకంగా మారింది. ఛత్ పండుగ సమయానికే ఎన్నికలు రావడంతో ప్రజల్లో ఓటు వేయాలన్న ఉత్సాహం మరింత పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కుటుంబాల సమేతంగా బూత్‌లకు వచ్చి ఓటు వేశారు. అయితే ఈ పెరిగిన ఓటింగ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చని టాక్ వినిపిస్తోంది. కాగా, ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ప్ర‌ధానంగా పోటీ నెలకొంది. ఇక ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో కొత్త ఆకర్షణగా మారింది. మ‌రి ఈ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉందో ఫలితాల రోజు తెలుస్తుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img