epaper
Friday, January 23, 2026
epaper

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు
గుడుంబా త‌యారీకి త‌ర‌లుతున్న బెల్లం
జాతర ముసుగులో అక్రమ అమ్మకాల జోరు
అటకెక్కిన అధికారుల పర్యవేక్షణ
నర్సంపేటలో బట్టబయలైన నిర్లక్ష్యం

కాకతీయ, నర్సంపేట : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అనాదిగా తెల్ల బెల్లం (బంగారం)ను మొక్కులుగా సమర్పించే ఆచారం కొనసాగుతోంది. ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా టన్నుల కొద్దీ బెల్లం అమ్మవార్లకు సమర్పిస్తారు. అయితే ఇదే అదునుగా కొందరు వ్యాపారులు దేవుడి పేరుతో గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లాన్ని అక్రమంగా విక్రయిస్తూ అదనపు ఆదాయానికి తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం నల్ల బెల్లాన్ని నిషేధించినప్పటికీ, గుడుంబా తయారీ దారులు తెల్ల బెల్లంతోనే మద్యం తయారుచేస్తున్నారని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. నర్సంపేట పట్టణ పరిధిలోని పలు కిరాణా దుకాణాలు ‘దేవుడి పేరిట అమ్మకం’ అంటూ పట్టపగలే బెల్లం స్పటికాన్ని విక్రయిస్తున్నాయని తెలుస్తోంది. దీనిపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా అటకెక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల మాటలు.. నీటిమీద రాతలు..
అక్రమ అమ్మకాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడం తప్ప, క్షేత్రస్థాయిలో అమలు శూన్యంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉందని, మాటలకే పరిమితమై చేతల్లో చర్యలు లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. పర్యవేక్షణ పూర్తిగా నీరుకారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నర్సంపేట పట్టణంలో బెల్లం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతుండటం అధికారుల పనితీరుపై పెద్ద ప్రశ్నలు లేపుతోంది. షాపు యాజమాన్యాలు–అధికారుల మధ్య ఏవైనా అఘోర ఒప్పందాలు జరిగాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ‘బంగారం’ పేరిట గుడుంబా తయారీకి ఉపయోగించే పదార్థాల విక్రయం జోరుగా సాగుతుండటం విమర్శలకు దారి తీస్తోంది.

బెల్లం అమ్మకాల్లో నర్సంపేట టాప్!

సమ్మక్క–సారలమ్మ జాతర ముసుగులో పట్టణంలోని పలు కిరాణా దుకాణాలు అధిక మొత్తంలో గుడుంబా తయారీకి అవసరమైన పదార్థాలు విక్రయిస్తూ నర్సంపేటను టాప్‌లో నిలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. చెక్కర, ఈస్ట్ ఫౌండ్రీల నుంచి వచ్చే పట్టికలు కూడా బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. జాతర ముసుగులో అక్రమంగా బెల్లం పట్టపగలే విక్రయిస్తున్న దుకాణాలను నియంత్రించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీసం రోజువారీ పర్యవేక్షణ కూడా భారంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’ సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు ప్రజా...

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్ పాఠశాల సమయంలో చేయొద్ద‌ని డీఈవో చెప్పినా...

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన...

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు మేడారం జాత‌ర‌కు ప్ర‌త్యేకంగా 4,000 ప్రత్యేక...

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం వరద కాలువ ప‌నులు అర్ధాంత‌రంగా...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! చెత్త డ్యూటీకి చీవాట్లు! బల్దియా డ్రైవర్లపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్...

పురపోరుకు సై

పురపోరుకు సై నర్సంపేటలో రాజకీయ వేడి బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య తగ్గా పర్ కీల‌కంగా మారనున్న...

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు కాకతీయ, రాయపర్తి : ప్రతి ఒక్కరూ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img