epaper
Saturday, November 15, 2025
epaper

‘కబ్జాదారుడే కబ్జా అనడం సిగ్గుచేటు’

కాకతీయ, గీసుగొండ : తమ ఊరి భూమి కోసం వెళ్తే కబ్జాదారులుగా ముద్ర వేయడం సిగ్గుచేటని కొనాయి మాకుల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. గ్రామంలో బుధవారం వారు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గీసుగొండ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్లు 783,784లో గ్రామస్తులకు చెందిన 16.18 గుంటల భూమి ఉందని తెలిపారు. అందులో రెండు ఎకరాలు గతంలో గ్రామాభి వృద్ధి కోసం వేలంపాట ద్వారా అమ్మగా, మిగిలిన 12 ఎకరాలను అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు రికార్డులు మార్చించి కొనుగోలు చేశారని తెలిపారు.

అయితే, కొనుగోలు చేసిన భూమి కంటే ఎక్కువగా ఆక్రమించి వెంచర్‌ ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు. ఇటీవల సర్వే చేయించగా 784/B సర్వే నంబరులో 18 గుంటల భూమి ఆక్రమించబడి నట్లు తేలిందని తెలిపారు. ఆ భూమిని దున్నడానికి వెళ్లిన ఎనిమిది మందిపై తప్పుడు కేసులు బనాయించి, ట్రాక్టర్ డోజర్‌ను సీజ్ చేయడం అన్యాయమని వారు మండిపడ్డారు. గత పదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో భూములు కబ్జా చేసిన వారు ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని వారు విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వజ్ర రాజు, పీసాల రాజేశ్వరరావు, సిరిశే రాజు, లకిడే తిరుపతి, ఎండి రహీం, ఎండి సుకూర్, కాందారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు ఆరోపణలు సరికాదు..

కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ పోలీసు ధర్మారావు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ అన్నారు. గత పది సంవత్సరాలుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేశారన్నారు. వారికి అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img