epaper
Saturday, November 15, 2025
epaper

పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు స‌రికాదు

  • స్వ‌తంత్ర దేశంగా 145 దేశాలు గుర్తింపు
  • ఐరాస‌లో అమెరికా వ్య‌తిరేకించ‌డం సిగ్గుచేటు
  • సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్

కాకతీయ, వరంగల్ బ్యూరో : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ జరుపుతున్న జినోసైడ్ హత్యాకాండ, దురాక్రమణ దాడులను ఖండిస్తున్న‌ట్లు సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. శ్రీనివాస్ ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, బ్రిటన్ వంటి సామ్రాజ్యవాద దేశాలు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ప్ర‌య‌త్నించాయ‌న్నారు.

అందులో భాగంగా 1948లో పాలస్తీనా భూభాగంపై కృత్రిమంగా ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలకులు పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమిస్తూ ప్రజలను ఊచకోత కోస్తున్నారని దుయ‌బ‌ట్టారు. ఈ దుశ్చర్యలకు అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల అండ ఉందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలైన 145 దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయ‌న్నారు. దీనిని అమెరికా వ్యతిరేకించ‌డం త‌గ‌ద‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా గాజా త‌దితర ప్రాంతాల్లో ఇజ్రాయిల్ ప్రభుత్వం జరుపుతున్న మారణకాండలో 66 వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. రెండు లక్షల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఆహార సరఫరా నిలిపివేయడం వల్ల వందలాది మంది ఆకలితో మరణిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారికి సహాయం చేయడానికి వస్తున్న స్వచ్ఛంద సంస్థల నౌకలను ఇజ్రాయిల్ అడ్డుకుని 500 మందిని నిర్బంధించిందని ఆయన పేర్కొన్నారు.

ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గ చర్యలను ప్రపంచ ప్రజలు ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, జిల్లా ప్రతినిధి గంగుల దయాకర్, మానవ హక్కుల వేదిక నాయకులు బండి కోటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మెడ సాంబయ్య, జిల్లా అధ్యక్షులు జక్కుల తిరుపతి, పిడిఎస్యు ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, బన్న నర్సింగం, బండి కుమార్, అయిత యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img