epaper
Friday, April 3, 2026
epaper

లడే తిరుపతి బడా మోసం?

లడే తిరుపతి బడా మోసం?

ఏనుమాముల వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం!
బోర్డు తిప్పేసిన గాయత్రి ట్రేడర్స్ యజమాని!
ఐపీ పెట్టినట్లు అనధికారిక సమాచారం

కాకతీయ, వరంగల్ : వరంగల్ లో మరో మిర్చి వ్యాపారి బోర్డు తిప్పేశాడు. భారీ మొత్తంలో బాకీ పడిన వారికి పంగనామాలు పెట్టాడు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు చెందిన వ్యాపారి రూ. 5కోట్లకు ఎగనామం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
సదరు వ్యాపారి మొత్తానికి ఐపీ పెట్టినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఆ మొత్తం ఎవరికి ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలనే విషయం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాల్లోకి వెళితే.. ఏనుమాముల మార్కెట్లో గాయత్రి ట్రేడర్స్ పేరిట లడే తిరుపతి అనే వ్యాపారి లావాదేవీలు నిర్వహించేవాడు. అయితే, వారం రోజులుగా తిరుపతి మార్కెట్ కు రావడం లేదు. అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉంది. ఇంట్లో భార్యను వదిలేసి ఒక్కడే వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమెను అడిగితే నీకేమి తెలియదు అని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తిరుపతి డబ్బు రూపేనా సంబంధాలు ఉన్న కొందరు వ్యాపారులు వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి బోర్డు తిప్పేసి ఉడాయించి ఉంటాడని అనుమానిస్తున్నారు. సుమారు రూ. 5కోట్ల మేర బాకీలపై కోర్టులో ఐపీ పెట్టి ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే.. ఆయన ఎవరెవరిపై ఐపీ పెట్టి ఉంటాడో వారికి నోటీసులు అందితే గానీ అసలు నిజం బయటకు రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. లేదంటే ఆయనే స్వచ్ఛందంగా మార్కెట్లోకి వస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, చాంబర్ ప్రతినిధులు ఎలాంటి ప్రకటనలు చేయకపోయినా.. విషయం మాత్రం దావానలంలా వ్యాపార వర్గాల్లో వ్యాపించింది. బాధితుల్లో ఇప్పటికే ఆందోళన నెలకొనగా.. వ్యాపారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఒకటీ, రెండు రోజుల్లో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే, ఈ బాకీల్లో రైతులు ఉన్నారా? కేవలం వ్యాపారులేనా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ రైతులు ఉంటే.. వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి సంఘటనలు జరగకముందే అధికారులు.. ఈ విషయంపై దృష్టిసారించి.. రైతులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అయితే ఈ వ్యాపారి ఐదేళ్ల క్రితం జమ్మికుంటలో కూడా మోసం చేసి ఐపీ పెట్టీ ఉడాయించినట్లు తెలుస్తోంది. అక్కడినుండి వరంగల్ కు వచ్చిన తిరుపతి గాయత్రి ట్రేడర్స్ తో వ్యాపారం కొనసాగించాడు. అడ్తీ వ్యాపారులను మచ్చిగ చేసుకున్నాడు. అడ్తీ దారుల వద్ద భారీగా మిర్చిని కొనుగోలు చేసి ఇక్కడే అమ్ముకొని సోమ్ము చేసుకొని పక్క ప్లాన్ తో పారిపోయినట్లు తెలుస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!?

రూ. 5కోట్లకు ఏనుమాముల వ్యాపారి ఎగనామం!? బోర్డు తిప్పేసిన పెద్ద వ్యాపారి.. ఐపీ పెట్టినట్లు...

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో పెద్దమ్మ తల్లి ఉత్సవాలు కాకతీయ, రాయపర్తి: పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు...

నారాయణలో గ్రాడ్యుయేషన్​డే వేడుకలు

నారాయణలో గ్రాడ్యుయేషన్​డే వేడుకలు కాక‌తీయ‌, జనగామ : జనగామ పట్టణంలోని నారాయణ హై...

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం *మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి:ములుగు జిల్లాలో...

అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి ములుగు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ కాకతీయ, ములుగు...

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి గ్రామ సభలతో సమస్యలకు పరిష్కారం పరకాల ఎమ్మెల్యే రేవూరి...

రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

రాంకీ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక కాకతీయ, వరంగల్ : వరంగల్...

ఐటీ కడితే రేషన్ కార్డు లేనట్టేనా?

ఐటీ కడితే రేషన్ కార్డు లేనట్టేనా? మధ్యతరగతిపై కొత్త భారం.. ఖిలావరంగల్‌లో ప్రజల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img