ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు
టాస్క్ ఫోర్స్ దాడుల్లో 12 మంది అరెస్ట్
కాకతీయ, హనుమకొండ : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లపై ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ నిర్వహణతో పాటు పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హన్మకొండ గోపాలపూర్ వెంకటేశ్వర కాలనికి చెందిన గట్ల రాజేష్ ఐపీఎల్ మ్యాచ్లపై క్రిక్666.లైవ్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు బెట్టింగ్లో పాల్గొన్న మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1,06,000 నగదు, 12 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించారు. అరెస్టైన వారిలో గర్నపల్లి అరవింద్, చిట్ల రాజేష్, దేవర వినయ్, జెట్టబోయిన కుమార్, ముప్పరపు రాజేంద్ర ప్రసాద్, వంగా శివ కుమార్, గంగుల అనిల్, బషబోయిన శ్రీకాంత్, ఎర్లా విఘ్నేష్, బూరు మధుకర్, పినిగిల్ల రవీందర్ ఉన్నారు. ఈ దాడిని ఏసీపీ ఎ. మధుసూదన్, ఇన్స్పెక్టర్ సర్లా రాజు, ఆర్ఎస్ఐ ఓ. భాను ప్రకాశ్, టాస్క్ ఫోర్స్ బృందం సమన్వయంతో నిర్వహించారు.


