epaper
Thursday, January 15, 2026
epaper

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
* పశ్చిమ బెంగాల్‌కు చెందిన గ్యాంగ్ పట్టివేత
* రూ.16 లక్షల విలువైన బంగారు–వెండి నగలు స్వాధీనం
* సీసీఎస్–కెయూసీ పోలీసుల సమన్వయ ఆపరేషన్

కాకతీయ, హనుమకొండ : పట్టపగలు ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్, కెయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.16 లక్షల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 15 తులాల బంగారు నగలు, 5.5 తులాల వెండి నగలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు అయిన నిందితులు ఫెరోజ్ షేక్, సుక్ చంద్, యామీన్‌లుగా గుర్తించారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లా, బేలదంగా తాలూకా, ముజ్‌పార్ గ్రామానికి చెందినవారిగా పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు ఫెరోజ్ షేక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు.
దొంగతనాలే జీవనం..!
మద్యం, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ముఠా పట్టపగలే ఇండ్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. బంగారు, వెండి నగలను దొంగిలించి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. గతంలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ ఈ ముఠా దొంగతనాలకు పాల్పడింది. ఆయా రాష్ట్రాల పోలీసుల చేత అరెస్టై జైలు పాలైన చరిత్ర కూడా ఉంది. రెండు నెలల క్రితమే పశ్చిమ బెంగాల్ జైలు నుంచి విడుదలై తెలంగాణలో మళ్లీ దొంగతనాలకు పథకం వేసినట్లు వెల్లడైంది.
హనుమకొండ పరిధిలో 2025 డిసెంబర్ 17న పరిమళ కాలనీ, సప్తగిరి కాలనీల్లో రెండు ఇండ్లలో దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం డిసెంబర్ చివర్లో మరోసారి ప్రయత్నించి విఫలమయ్యారు. 2026 జనవరి 10న గోపాలపురం, శివసాయి కాలనీలోని ఒక ఇంట్లో తాళం పగలగొట్టి 15 తులాల బంగారం, 5 తులాల వెండి నగలు, నగదు దోచుకున్నట్లు వెల్లడించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ సెంట్రల్ జోన్ దారా కవిత పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీ కనిపెట్టి కెయూసీ జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో పట్టుకున్నారు. పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను ఒప్పుకున్నారు.
పోలీసులకు ప్రశంసలు
ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ, కెయూసీ ఇన్‌స్పెక్టర్ ఎస్. రవికుమార్, ఐటీ కోర్ టీం ఏఏఓ ఎం.డి. సల్మాన్ పాషా, సీసీఎస్ ఎస్సైలు రాజ్‌కుమార్, సాయి ప్రసన్న కుమార్, శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు కె. మహేశ్వర్, వి. జంపయ్య, కానిస్టేబుళ్లు టి. మధుకర్, బి. చంద్రశేఖర్, ఎస్. రాములు, జి. ఉపేందర్, కె. వంశీ, జి. విశ్వేశ్వర్, జి. వినోద్‌లను పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img