epaper
Tuesday, April 7, 2026
epaper

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం

వరంగల్ అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం
ఆధునిక మౌలిక వసతుల విస్తరణ లక్ష్యం
సుస్థిర నగర నిర్మాణానికి చర్యలు
యూజీడి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి
జీడ‌బ్ల్యూఎంసీ మేయ‌ర్ గుండు సుధారాణి
కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో స‌మీక్ష స‌మావేశం

కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మహా నగర అభివృద్ధికి అంతర్జాతీయ భాగస్వామ్యం అత్యంత కీలకమని నగర మేయర్ జి సుధారాణి అన్నారు. జర్మనీ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ప్రతినిధులతో మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమీక్షా సమావేశంలో మేయర్, హన్మకొండ జిల్లా కలెక్టర్/జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడి) ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (డీపీఆర్)ను అధికారులు దృశ్యరూప ప్రదర్శన ద్వారా కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులకు వివరించారు.ఈ సందర్భంగా

మేయర్ మాట్లాడుతూ వరంగల్ నగరం కాకతీయుల వైభవాన్ని ప్రతిబింబించే చారిత్రక ప్రాధాన్యత కలిగిన నగరమని, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరాన్ని శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో వరంగల్ నగర అభివృద్ధికి అపారమైన నిధులు కేటాయిస్తూ, నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని మేయర్ పేర్కొన్నారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ డ్రైన్ ప్రాజెక్టులకు రూ. 5,725.40 కోట్ల నిధులు మంజూరు చేయడం ఆయన సంకల్పానికి నిదర్శమని తెలిపారు. యూజీడి ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి అయి, త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని మేయర్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు నగర పారిశుధ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ స్థాయి సంస్థ అయిన కేఎఫ్‌డబ్ల్యూ సహకారంతో యూజీడి ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయగలమని, వారి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం నగరాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

హన్మకొండ జిల్లా కలెక్టర్/జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, యూజీడి ప్రాజెక్టు విజయవంతమైన అమలుకు శాఖల మధ్య సమన్వయం కీలకమని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేఎఫ్‌డబ్ల్యూ బృందం అందించిన సూచనలు ప్రాజెక్టు నాణ్యతను మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.

కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధులు మాట్లాడుతూ, యూజీడి ప్రాజెక్టుపై సమగ్రంగా వివరాలు అందించారని, రాబోయే రోజుల్లో మరిన్ని సాంకేతిక అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు అందిస్తామని తెలిపారు.
అనంతరం కేఎఫ్‌డబ్ల్యూ ప్రతినిధుల బృందాన్ని మేయర్ కలెక్టర్ లు శాలువాలు, పూల మొక్కలతో సత్కరించి నగర కీర్తిని చాటే కాకతీయ కళా తోరణాలతో కూడిన ప్రతిమలను బహుకరించారు. కార్యక్రమం లో కేఎఫ్ డబ్ల్యూ ప్రతినిధులు పరిమల్, రుచి, నితిన్, ఇన్చార్జి ఎస్ఈ శ్రీనివాస్ రావు, సిఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, సిహెచ్ఓ రమేష్, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీంద్ర డీ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ లు ప్రసన్న రాణి, సమ్మయ్య, బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రామన్నగూడెం లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు : మండలం లోని...

ఇంటర్న్ షిప్ విద్యార్థులకు ఉపయోగకరం

ఇంటర్న్ షిప్ విద్యార్థులకు ఉపయోగకరం ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు కాకతీయ, నెల్లికుదురు : ఇంటర్న్...

అమ్మ.. నాయినో!

అమ్మ.. నాయినో! ఎంజీఎంపై ఎంత కాలానికి స్పందన ? ఆస్పత్రిని సందర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే...

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు !

రాసింది కరెక్టే.. రాయకుంటే బాగుండు ! ఇదీ ఆయుర్వేద వైద్య క‌ళాశాల అధికారుల‌...

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

25వ వార్డులో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,నర్సంపేట టౌన్...

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్

కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా అశోక్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి...

ఆహార భద్రతలో రాజీ పడొద్దు

ఆహార భద్రతలో రాజీ పడొద్దు నాణ్యమైన ఆహారంతోనే మెరుగైన ఆరోగ్యం గడువు తేదీలు తప్పనిసరిగా...

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు

వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి 14.44 కోట్లు మంజూరు కేంద్రం నిధులతో పునరుద్ధరణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img