అంబాల్పూర్లో అభివృద్ధి పనుల పరిశీలన
కాకతీయ,శంకరపట్నం : మండలంలోని అంబాల్పూర్ గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించేందుకు శనివారం అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో సీసీ రోడ్లు, పనుల అమలు విధానంపై వివరాలు తెలుసుకునేందుకు డిఆర్డిఓ వి. శ్రీధర్ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధులను పరిశీలించిన ఆయన, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, నిర్దిష్ట గడువులో పూర్తిచేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, సీసీ రోడ్ల నిర్మాణంతో రాకపోకలు సులభతరం అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డిఈ రవి ప్రసాద్, ఏఈ మల్లేశం, పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్, సర్పంచ్ వడ్లకొండ వెంకటేష్, ఉపసర్పంచ్ పొన్నం మహేష్, వార్డ్ సభ్యులు రావణవేణి కుమారస్వామి తదితరులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


