epaper
Sunday, March 1, 2026
epaper

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
డీజీపీకి వినతిపత్రం సమర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలన్న డిమాండ్
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతల విజ్ఞప్తి

హైదరాబాద్ / నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేందర్ చారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, నేతలు స్వామి యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
తోపులాటలో పసికందు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతర సందర్భంగా జరిగిన తోపులాటలో రెండు నెలల చిన్నారి మృతి చెందిందని సమాచారం. ఈ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని, ఘటనకు కారణమైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
“బాధ్యులపై చర్యలు తప్పనిసరి”
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, జాతర వంటి ధార్మిక కార్యక్రమాల్లో భద్రతా లోపాలు ఉండకూడదని అన్నారు. చిన్నారి మృతి విషయంలో నిజాలు వెలికితీయాలని, ఎవరి ప్రమేయం ఉన్నా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు.
పసికందు తల్లిదండ్రులపై దాడి జరిగిందన్న ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన సాయం అందించాలని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img