epaper
Monday, March 2, 2026
epaper

ఇంద్ర‌వెళ్లి అమ‌ర‌త్వం తెలంగాణ‌కు స్ఫూర్తి

ఇంద్ర‌వెళ్లి అమ‌ర‌త్వం తెలంగాణ‌కు స్ఫూర్తి
స్వ‌రాష్ట్రంలో అందరికీ న్యాయం జ‌ర‌గాలి
అందుకోస‌మే ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌స్తున్నా..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ఆదిలాబాద్ జిల్లాలో రెండో రోజూ జ‌నంబాట‌
నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు
ఇంద్రవెల్లి స్థూపం వ‌ద్ద ఘ‌న నివాళులు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం చూడగానే… తెలంగాణ ప్రజలకు
భక్తి భావన, విప్లవ భావన, దేశభక్తి భావన కలుగుతుంద‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అన్యాయాన్ని చూస్తూ సహించి ఊరుకోకుండా ముందుకు నడిపించే స్ఫూర్తి మనకు కలుగుతుంద‌న్నారు. ఇక్కడి గిరిజన బిడ్డల తిరుగుబాటు తెలంగాణ బిడ్డలందరికీ ఉగ్గుపాలతో నేర్పించాల్సిన పాఠాలు అన్నారు. ఇంద్రవెల్లి స్థూపం వద్ద నివాళులు అర్పించటం త‌న అదృష్టం అన్నారు. ఏ త్యాగాలు, పోరాటాలు, విప్లవాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో… స్వ‌రాష్ట్రంలో అందరికీ న్యాయం జరగాల‌న్నారు. ఏ అమరవీరుల గురించి మనం మాట్లాడుతున్నామో ఆ అమరవీరులు, గిరిజనులు, ఆదివాసీల న్యాయం జరుగుతుందా మనం ఆలోచించాలి అన్నారు. జ‌నంబాట కార్య‌క్ర‌మంలో భాగంగా క‌విత కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.

రెండేళ్లలో పరిస్థితి దిగజారింది

గతంలో కొంతవరకు మనం న్యాయం చేసుకున్నాం. కానీ ఈ రెండేళ్లలో పరిస్థితి దిగజారింది. భవిష్యత్ తెలంగాణ ఎలా ఉండాలన్నది మనందరం ఆలోచన చేసుకోవాలి. జనం బాట కార్యక్రమంలో ప్రజలతో ఈ అంశాలన్ని మాట్లాడుతూ ముందుకు కదులుతున్నాం. ఆదిలాబాద్ లో మా రెండు రోజులు పర్యటన సమస్యల సమహారంగా సాగింది. ఇన్ని సమస్యలు ఆదిలాబాద్ చూడటం బాధాకరంగా ఉంది. ఐతే మేము ప్రస్తావించిన సమస్యల్లో కొన్ని సమస్యలు తీరిన సరే మా జాగృతి జనం బాట సూపర్ సక్సెస్ అయినట్లుగా భావిస్తాం. ప్రజల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నదే మా ఆలోచన. దానికి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం స్పూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నా… అని క‌విత అన్నారు.

రిమ్స్ హాస్పిటల్ ప‌రిశీల‌న‌

ఆదిలాబాద్‌లోని రిమ్స్ హాస్పిటల్‌ను క‌విత పరిశీలించి రోగుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో సౌకర్యాలు మెరుగ్గానే ఉన్నాయ‌ని, ఇక్కడున్న జూనియర్ డాక్టర్లు, నర్సులు పేదవాళ్ల కోసం పనిచేస్తున్నార‌న్నారు. పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరికీ వైద్యం అందిస్తున్నార‌ని అన్నారు. జూనియర్ డాక్టర్స్ డిమాండ్లు కొన్ని ఉన్నాయ‌ని, వాటి ప్రభుత్వం తీర్చాలని కోరారు. హాస్పిటల్ లో శానిటేషన్ చాలా దారుణంగా ఉంద‌ని, ఇక్క‌డికి వ‌చ్చే రోగులకు మంచి వాతావారణం క‌ల్పించాల‌ని వైద్యుల‌ను కోరారు. గతంలో శానిటేషన్ కోసమే ప్రత్యేక బడ్జెట్ ఇచ్చే వాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశార‌ని ఆరోపించారు. జిల్లాలో కార్డియాక్ అరెస్ట్ తో చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. హాస్పిటల్ లో కార్డియాలజిస్ట్ ను కచ్చితంగా నియమించాల‌ని కోరారు.
ప్రభుత్వం త్వరితగతిన హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలు కల్పించాలని క‌విత డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img