epaper
Saturday, November 15, 2025
epaper

మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై భార‌త్ విజ‌యం

ఇండియా విన్‌..!
మూడో వ‌న్డేలో ఆస్ట్రేలియాపై భార‌త్ విజ‌యం
ఆస్ట్రేలియాను కంగారెత్తించినా భార‌త బౌల‌ర్లు
త‌క్కువ స్కోరుకే క‌ట్ట‌డి.. బ్యాటింగ్‌లో స‌త్తా చాటినా రో-కో
ఫాంలోకి కోహ్లి.. రికార్డుల మోత మోగించిన రోహిత్‌
సిరీస్ పోయినా.. మూడో వ‌న్డేలో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన భార‌త్‌

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. చివరి వన్డేలో రోహిత్‌ శర్మ సెంచరీతో చేలరేగాడు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడో వ‌న్డేలో కంగారూలు నిర్ధేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 38.2 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. విరాట్ కోహ్లీ (74 నాటౌట్) తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టు విజయానికి స‌హ‌క‌రించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను గెలుచుకోకపోయినా, చివరి మ్యాచ్‌లో ప్రతిష్ఠను నిలబెట్టుకున్న‌ట్ల‌యింది. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకున్నప్పటికీ, చివరి మ్యాచ్‌లో భారత్ ఆధిపత్యం చూపించింది. దీంతో కంగారు టీమ్ భారత్‌ పై ద్వైపాక్షిక సిరీస్‌లో క్లీన్ స్వీప్ రికార్డును మరోసారి అందుకోలేకపోయింది. భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచి గౌరవప్రదంగా సిరీస్‌ను ముగించింది.

ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రారంభంలో మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ జాగ్రత్తగా ఆరంభించారు. అయితే 61 పరుగుల వద్ద హెడ్ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత భారత స్పిన్నర్లు ఆధిపత్యం చూపించారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రన్స్ రాకుండా అడ్డుకున్నారు. అక్షర్ పటేల్, మార్ష్‌ను 49 పరుగుల వద్ద ఔట్ చేయడంతో ఆతిథ్య జట్టు ఒత్తిడిలో పడింది. క్యారీ, రెన్షా త్వరగా వెనుదిరగడంతో 183/3 నుంచి 195/5కి పడిపోయింది. హర్షిత్ రాణా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో 4 వికెట్లు తీశాడు. నాథన్ ఎలిస్, మిచెల్ స్టార్క్ సహా టెయిలెండర్లను ఔట్ చేస్తూ ఆస్ట్రేలియాను 46.3 ఓవర్లలో 236 పరుగులకు పరిమితం చేశాడు. ఆసీస్‌ బ్యాటర్లలో మ్యాట్‌ రెన్‌షా (56), మిచెల్‌ మార్ష్‌ (41) రాణించారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4, సుందర్ 2.. సిరాజ్, కుల్‌దీప్‌, అక్షర్, ప్రసిద్ధ్‌ కృష్ణ తలో వికెట్ తీశారు.

స‌త్తా చాటిన రో-కో..!

అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు శుభారంభం దక్కింది. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ తొలి వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. 24 పరుగుల వద్ద హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో గిల్‌ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి బంతికే తన పరుగుల ఖాతా తెరిచాడు. మొదటి రెండు వన్డేల్లో వరుసగా డకౌట్‌ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో మాత్రం తన స‌త్తా చాటాడు. కోహ్లీ 81 బంతుల్లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో కుమార సంగక్కర రికార్డును దాటి, వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక రన్స్ సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతని ముందు ఇప్పుడు సచిన్ టెండుల్కర్ మాత్రమే ఉన్నాడు. రోహిత్ శర్మ 125 బంతుల్లో 121* పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో తన 33వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇద్దరి మధ్య 168 పరుగుల అజేయ భాగస్వామ్యం భారత్ విజయంలో కీలకం అయ్యింది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్‌ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌!

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత్‌ సిద్ధం.. తొలి టెస్టుకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌! ఈడెన్ గార్డెన్స్...

అలా చేస్తేనే ఇండియా జట్టులో స్థానం..

అలా చేస్తేనే ఇండియా జట్టులో స్థానం.. విరాట్-రోహిత్‌కు బీసీసీఐ అల్టిమేటం! విరాట్, రోహిత్‌పై బీసీసీఐ...

దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్‌..

దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కి ముందు గంగూలీ సజెషన్‌.. జురేల్‌కు సపోర్ట్‌! కాక‌తీయ‌, స్పోర్ట్స్ :...

ఓడినా.. నేనే కెప్టెన్‌

ఓడినా.. నేనే కెప్టెన్‌ టీ 20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను నడిపిస్తా.. సొంతగడ్డపై ఓట‌మితో చాలా...

టీమిండియాదే సిరీస్

టీమిండియాదే సిరీస్ భార‌త్‌.. ఆస్ట్రేలియా ఆఖరి టీ 20 రద్దు.. ఓపెనర్లు గిల్.. అభిషేక్...

శ్రీచరణితోనే భారత్ గెలిచింది

శ్రీచరణితోనే భారత్ గెలిచింది మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంస‌ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్...

విశ్వ విజేత‌గా భార‌త్‌

విశ్వ విజేత‌గా భార‌త్‌ ఐసీసీ వుమెన్స్ వ‌ర‌ల్డ్ కప్ కైవ‌సం ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుపై...

ఎవ‌రు గెలిచినా.. చ‌రిత్రే..!

ఎవ‌రు గెలిచినా.. చ‌రిత్రే..! మ‌రి కొద్దిసేప‌ట్లో మ‌హిళ‌ల వన్ డే మ్యాచ్ ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img