epaper
Saturday, November 15, 2025
epaper

26 మంది ప్రాణాల కంటే పాకిస్తాన్ తో మ్యాచ్ ముఖ్యమా? ఓవైసీ ఫైర్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య ఈ రోజు జరగనున్న ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ రాజకీయంగా తీవ్ర దుమారాన్నే రేపుతోంది. ఇటీవల జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడటాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతోపాటు పలు విపక్ష పార్టీలు కూడా తీవ్రంగా తప్పుబట్టాయి. దేశ భద్రత, పౌరుల ప్రాణాల కంటే ప్రభుత్వానికి డబ్బే ముఖ్యమైందా అంటూ ప్రశ్నించారు.

ఈ అంశంపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పహల్గామ్ లో మన 26 మంది పౌరులను మతం అడిగి మరీ కాల్చి చంపిన పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని చెప్పే దమ్ము మీకు లేదా అని అసోం, యూపీ సీఎంలను ఉద్దేశించి ఓవైసీ ప్రశ్నించారు. ఈ ఒక్క మ్యాచ్ ద్వారా బీసీసీఐకి వచ్చే రూ. 2వేల కోట్లు, రూ. 3వేల కోట్లు 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఎక్కువైపోయాయా అంటూ నిలదీశారు. రక్తం నీరు కలిపి పారలేవని..ఉగ్రవాదం చర్చలు ఒకేసారి సాగవని గతంలో ప్రధాని చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ 26మంది పౌరుల కుటుంబాలకు తాము నిన్న, నేడు, రేపు కూడా అండగా నిలుస్తామని ఓవైసీ స్పష్టం చేశారు.

భారత్–పాక్ మ్యాచ్ చుట్టూ కేవలం క్రీడా ఉత్కంఠ మాత్రమే కాకుండా, రాజకీయ వేడెక్కింపూ కనిపిస్తోంది. ఈ పోరును వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు బహిరంగంగా డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత అభిషేక్ దత్ మాట్లాడుతూ – “ఒకవైపు ప్రభుత్వం ఉగ్రవాదంతో చర్చలు జరపబోమంటూ హామీ ఇస్తుంది. అదే సమయంలో పాకిస్థాన్ జట్టుతో క్రికెట్ ఆడమని అనుమతి ఇవ్వడం ద్వంద్వ వైఖరి కాదా?” అని ప్రశ్నించారు. ఈ నిర్ణయం దేశానికి తప్పు సందేశాన్ని ఇస్తోందని ఆయన విమర్శించారు.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మరింత ఘాటుగా నిరసన తెలిపింది. ఢిల్లీలో పాకిస్థాన్ ప్రతీక బొమ్మను దహనం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ – “మన కుటుంబాల ప్రాణాలను బలి తీసుకున్న వారితో మన ఆటగాళ్లను మైదానంలో నిలబెట్టడం ఎంత పెద్ద అన్యాయం!” అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, భారత్-పాక్ మ్యాచ్‌ను ప్రసారం చేసే క్లబ్బులు, రెస్టారెంట్లను బహిష్కరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మొత్తం మీద, ఆసియా కప్‌లోని ఈ పోరు కేవలం క్రికెట్ కాదని, ఇప్పుడు కేంద్రం – విపక్షాల మధ్య కొత్త రాజకీయ చర్చలకు వేదికగా మారిందని చెప్పవచ్చు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాక‌తీయ‌, జాతీయం: బీహార్ అసెంబ్లీ...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌! ఫరీదాబాద్ మాడ్యూల్...

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే...

ఎన్‌డీఏదే బీహార్… మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం

ఎన్‌డీఏదే బీహార్ ప‌నిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు మహాఘట్...

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! కాక‌తీయ‌, జాతీయం : దేశ...

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా? కాక‌తీయ‌, జాతీయం : దేశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img