epaper
Saturday, November 15, 2025
epaper

కేంద్రం సంచలన నిర్ణయం.. ఇండియా నుంచి 16వేల మంది విదేశీయులు బహిష్కరణ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్న దాదాపు 16 వేల విదేశీయులను భారత్‌ నుంచి బహిష్కరించేందుకు హోం మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇతర ఏజెన్సీలు కలిసి చేపట్టిన తనిఖీల్లో ఈ విదేశీయులను గుర్తించారు. వీరిలో కొంతమంది మాదకద్రవ్యాల రవాణా, నేరచర్యలు, నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడం వంటి చర్యల్లో పాల్గొన్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీరిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచి, దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఈ చర్యలు తాజాగా అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం – 2025 లో భాగంగా చేపట్టబడుతున్నాయి. పాత నాలుగు చట్టాలను రద్దు చేస్తూ రూపొందించిన ఈ కొత్త చట్టానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం లభించగా, రాష్ట్రపతి ఏప్రిల్ 4న ఆమోదం తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇకపై అక్రమ పత్రాలతో దేశంలోకి ప్రవేశించిన వారికి కనీసం రెండు సంవత్సరాల జైలుశిక్ష, గరిష్టంగా ఏడు సంవత్సరాల వరకు శిక్షతో పాటు రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అయితే ఇంకా కోట్లాది ప్రజలు పేదరికంలోనే జీవిస్తున్నారు. పేదలను ఆదుకోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చిన విదేశీయులు కూడా ఈ పథకాల లబ్ధి పొందడం వల్ల అసలు అర్హులైన పేదలకు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను పూర్తిగా అరికట్టేందుకు కేంద్రం కొత్త వలస చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై అక్రమ వలసదారులకు ఎలాంటి ఉపశమనం ఉండదు. నకిలీ పత్రాలతో దేశంలో ఉండే వారికి తక్షణమే చర్యలు తీసుకుంటారు. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ చర్యలతో భారత్‌లో అక్రమ వలసల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే దేశ భద్రత, చట్టవ్యవస్థకు భంగం కలిగించే విదేశీయులను తరిమివేయడం ద్వారా అంతర్గత భద్రత మరింత బలోపేతం కానుంది.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..!

బీహార్‌లో ఎన్డీఏ క్లియర్ విక్టరీ.. గెలుపు రహస్యాలివే..! కాక‌తీయ‌, జాతీయం: బీహార్ అసెంబ్లీ...

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..!

పీకే ప్రాజెక్ట్ బీహార్‌లో క్రాష్..! పీకే అంచనాలను తారుమారు చేసిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లలో...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌!

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌ గుట్టు రట్టు.. ఇమామ్ ఇర్ఫాన్ అరెస్ట్‌! ఫరీదాబాద్ మాడ్యూల్...

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..

ఢిల్లీ బ్లాస్ట్‌ కుట్రలో కొత్త మలుపు..జనవరి 26న మరో దాడికి ప్లాన్..! దీపావళికే...

ఎన్‌డీఏదే బీహార్… మహాఘట్ బంధన్ పై దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యం

ఎన్‌డీఏదే బీహార్ ప‌నిచేసిన ‘నిమో’ (నితీష్+మోదీ) ఫార్ములా ఎన్డీయే కూటమికి 46.2 శాతం ఓట్లు మహాఘట్...

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్! కాక‌తీయ‌, జాతీయం : దేశ...

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా?

ఢిల్లీ: ఆ భ‌య‌మే బాంబ్ బ్లాస్ట్‌కు కార‌ణ‌మా? కాక‌తీయ‌, జాతీయం : దేశ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img