epaper
Thursday, January 15, 2026
epaper

జీడబ్ల్యూఎంసీ డివిజన్లను పెంచండి

జీడబ్ల్యూఎంసీ డివిజన్లను పెంచండి
నగర విస్తరణకు అనుగుణంగా పాలనా మార్పులు జ‌ర‌గాలి
కాజీపేట బస్ స్టేషన్‌కు భూమి కేటాయించండి
భద్రకాళి ఆలయ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోండి
ముఖ్య‌మంత్రికి వ‌రంగ‌ల్ ఎమ్మెల్యేల విన‌తి
సానుకూలంగా స్పందించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల సంఖ్యను పెంచాలని వరంగల్ ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. వరంగల్ నగరం రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రజల అవసరాలు, నగర విస్తరణ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 66 డివిజన్లు సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వివరించారు. పాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు డివిజన్ల సంఖ్య పెంపు అత్యవసరమని స్పష్టం చేస్తూ ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

కాజీపేట బస్ స్టేషన్‌కు భూకేటాయింపు చేయాలి

కాజీపేట బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూకేటాయింపు ప్రక్రియను రైల్వే శాఖతో సమన్వయం చేసి వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రైల్వే అధికారులు సంబంధిత స్థలంలో సర్వే నిర్వహించారని, తదుపరి చర్యలు త్వరితగతిన చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. బస్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే కాజీపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు. భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ఆలయ అభివృద్ధితో పాటు మరమరపు మాడ వీధుల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వరంగల్ రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

సమగ్ర అభివృద్ధికి భరోసా

వరంగల్ నగర ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు భరోసా ఇచ్చారు. నగర విస్తరణకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img