epaper
Wednesday, March 25, 2026
epaper

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం

అర్ధరాత్రి అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
విద్యారంగ సమస్యల పరిష్కారం కోరితే అక్రమ అరెస్టులా?
ప్రజాపాలనలో విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు
విద్యార్థి ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అజిత్

కాకతీయ, కొత్తగూడెం : అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని, ప్రజాపాలనలో ప్రజాస్వామ్యం కూనీ అవుతోందని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ మండిపడ్డారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ‘చలో అసెంబ్లీ’ పిలుపునిచ్చిన నేపథ్యంలో, విద్యార్థి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సగం పాలనా పూర్తిచేసుకుంటున్నప్పటికీ హామీలు ఆచరణకు నోచుకోవడం లేదని, ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ బకాయిలు విడుదల చేయడం లేదని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్ల డైట్, కాస్మోటిక్ చార్జీలు ఆరు నెలలకోసారి వస్తే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ప్రకటన తప్ప క్షేత్రస్థాయిలో పని జరగడం లేదని, శిథిలావస్థలో ఉన్న హాస్టళ్లకు సొంత భవనాలు ఏవని నిలదీశారు. కేవలం 40 కోట్లతో కాకతీయ యూనివర్సిటీ ఎలా ముందుకు సాగుతుందని, ప్రైవేట్ ఫీజుల నియంత్రణ చట్టం ఎక్కడ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని, రాష్ట్రంలో విద్య తెలిసిన మంత్రి లేరా అని దుయ్యబట్టారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, రేవంత్ రెడ్డి తీరుకు విద్యార్థులు భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని హెచ్చరించారు. తక్షణమే విద్యార్థి నాయకులను విడుదల చేసి, విద్యా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన

గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదన సెల్వరాజును రక్షించిన పోలీసులు వాకింగ్‌కు వెళ్లిన మాజీ సర్పంచ్...

శభాష్ సుష్మ

శభాష్ సుష్మ పోలీస్ స్పోర్ట్స్-మీట్‌లో బంగారు ప‌త‌కాలు సాధించిన కానిస్టేబుల్ కాకతీయ ,కొత్తగూడెం :...

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత

వీరవెల్లి నాగేశ్వరరావు కన్నుమూత మాజీ ఎమ్మెల్యే సండ్ర వేంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి...

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి

గడువులోగా గ్రంథాల‌యం ప‌నులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం...

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం

రైతుల ఆదాయం పెంపే లక్ష్యం సాగును లాభసాటిగా మార్చే దిశగా చర్యలు యాంత్రీకరణ, అనుబంధ...

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి

డ్రగ్స్‌పై యుద్ధం చేయాలి మాదకద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యం మనమందరం సైనికులం.. అప్రమత్తంగా ఉండాలి ఈగల్...

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం

చలివేంద్రాల ఏర్పాటు అభినంద‌నీయం ప్రజలకు ఉప‌యోగ‌ప‌డే మంచి కార్యక్రమం సీఐ వి విజయ్ రామ్...

స్టెమ్ సెంటర్ ప్రారంభం

స్టెమ్ సెంటర్ ప్రారంభం గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు కొత్త దిశ జిల్లా సైన్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img