epaper
Monday, March 2, 2026
epaper

ఆదిత్య వింటేజ్‌లో అడ్డ‌గోలుగా అక్ర‌మాలు

  • స‌ర్కార్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచ‌ల‌న ప్ర‌శ్న‌లు
  • ముఖ్య‌మంత్రికి బ‌హిరంగ లేఖ‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నార్సింగిలో ఆదిత్య వింటేజ్ అక్ర‌మ నిర్మాణం కొన‌సాగిస్తున్న‌ద‌ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అనుమ‌తులు నిలిపివేసిన‌ప్ప‌టికీ .. మ‌ళ్లీ అనుమ‌తులు వ‌చ్చాయంటూ ఆదిత్య త‌న నిర్మాణాన్ని కొన‌సాగిస్తున్న‌ద‌ని, దీనిలో ఎవ‌రెవ‌రికి ఎంత ముట్టాయ‌ని ఆయ‌న నిల‌దీశారు. అడ్డగోలుగా ఆదిత్య వింటేజ్ నిర్మాణాలు చేపడుతున్నారని.. సర్వీస్ రోడ్డు లేకుండా నిర్మాణం చేస్తుంటే ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణం జరుగుతోందన్నారు. ఎవరి ప్రమేయంతో ఈ నిర్మాణాలు చేస్తున్నారని నిలదీశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు కాపీ పంపుతానని ఎంపీ ప్ర‌క‌టించారు.

ఎంత ముట్టింది..?

నార్సింగిలో బహుళ అంతస్తుల నిర్మాణానికి అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అనుమతులు ఇవ్వగా, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే పనులు నిలిపివేశార‌ని అన్నారు. ఆదిత్య పనులు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేస్తున్నదని చెప్పారు. ఈ పనులకు ముఖ్యమంత్రి అనుమతించారా ..? మంత్రులు ఒకే చెప్పారా ? ఎన్ని డబ్బులు చేతులు మారాయి ? అనేది ప్రజలకు సమాధానం చెప్పాలని రఘునందన్ డిమాండ్ చేశారు. శ్రీ ఆదిత్య బరితెగింపుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు.

గ‌త ప్ర‌భుత్వంలో అనుమ‌తులు

శ్రీ ఆదిత్య వింటేజ్‌కి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చాయని ఎంపీ రఘునందన్ రావు మీడియాకు వెల్లడించారు. ఇది అక్రమ నిర్మాణం అని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయ‌గా, కేసు న‌మోదైంద‌ని గుర్తు చేశారు. మూసీ పరివాహకంలో ఆదిత్య వింటేజ్ కడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇందులో భారీ కుంభకోణం నడిచిందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేశారని చెప్పారు. మ‌ళ్లీ ఇప్పుడు నిర్మాణ ప‌నులు కొన‌సాగించ‌డం ఏంట‌ని ర‌ఘునంద‌న్ ప్ర‌శ్నించారు.

పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారు

పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని…పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కి చిత్త శుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు. నిర్మాణం ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.హెచ్‌ఎమ్‌డీఏ అధికారులే కేసులు వేస్తారని.. మళ్లీ వారే అనుమతి ఇస్తారని విమర్శించారు. ఈ నిర్మాణ అనుమతులలో సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇన్వాల్వ్ అయ్యారా అని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, హద్దులు తొలగించారని క్రిమినల్ కేసులు నమోదు చేశారని.. ఈ నిర్మాణంలో సూట్‌ కేసులు అందుకుంటున్న మంత్రులు ఎవరో సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img