epaper
Sunday, March 15, 2026
epaper

జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం

జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం
జయశంకర్ జిల్లాపై దుష్ప్రచారం మానుకోండి!
అబద్ధాల పుట్టు పూర్వోత్తరాలు కేసీఆర్ ఇంట్లోనే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కాక‌తీయ‌, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందన్న దుష్ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉభయ కమ్యూనిస్టు నేతలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందంటూ కొందరు కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. “ఒకవేళ జిల్లా నిజంగానే మారితే, నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను” అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ రకమైన అబద్ధపు ప్రచారాలు ప్రజల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలేనని అన్నారు.

రూ.350 కోట్ల అభివృద్ధి కనిపించడంలేదా?

గత రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, లైటింగ్ వంటి మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని, పట్టణం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంటే కొందరు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిపై ఎవరికైనా సందేహాలుంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. “అబద్ధాలు ఎక్కడ పుట్టాయంటే… కేసీఆర్ ఇంట్లోనే పుట్టాయి” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై జరుగుతున్న అసత్యపు ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని, దానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, 30 వార్డుల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తీర్పుతోనే దుష్ప్రచారాలకు సరైన సమాధానం లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్...

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్ దళిత యువతిని మోసం చేసిన కేసులో అరెస్టు పెళ్లి చేస్తానని...

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,...

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు టెన్త్ ప‌రీక్ష కేంద్రాల‌ను తనిఖీ చేసిన కలెక్టర్ మౌలిక...

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల...

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం...

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం

న్యాయం చేయండి.... అర్హురాలికి అన్యాయం... - అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు - మెరిట్...

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన కాకతీయ, ములుగు ప్రతినిధి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img