కాకతీయ, ఇచ్చోడ : ఇచ్చోడ మండల ఎంఐఎం పార్టీ నూతన కార్యవర్గాన్ని శనివారం పార్టీ ఆదిలాబాద్ టౌన్ ప్రెసిడెంట్ నజీర్ హైమద్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఎంఐఎం పార్టీ ఇచ్చోడ మండల అధ్యక్షునిగా షేక్ జావిద్, జనరల్ సెక్రటరీగా షేక్ సజీద్, ట్రెజరర్ గా సుఫియాన్, జాయింట్ సెక్రటరీలుగా షేక్ ఆర్షద్, షేక్ ఆథర్, అఫ్రోజ్, సదీఖ్ ను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ.. మండలంలో ఎంఐఎం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున పోరాడుతామన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను టౌన్ ప్రెసిడెంట్ నజీర్ హైమద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.


