epaper
Wednesday, April 1, 2026
epaper

నేనే రాజు.. నేనే మంత్రి..

నేనే రాజు.. నేనే మంత్రి..
ఇసుక మాఫియాలో అధికారి మాటే శాసనం
టెండర్లు లేకుండానే గోదావరిలో తవ్వకాలు
గిరిజన సొసైటీ పేరుతో అక్రమాల క‌వ‌రింగ్‌
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన
ఎనిమిది నెలలు గడిచినా బదిలీ లేని అధికారి
మైనింగ్, విజిలెన్స్ మౌనంపై జ‌నం నుంచి విమర్శలు

కాకతీయ, మణుగూరు : నేనే రాజు.. నేనే మంత్రి అంటూ ఒక అధికారి ఇసుక మాఫియాతో చేతులు కలిపి గోదావరిలో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనలను పక్కనబెట్టి గిరిజన సొసైటీ పేరుతో భారీ దందా నడుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పరిధిలో డిషీల్టింగ్ పేరుతో ఈ అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. టెండర్లు పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి లారీల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నానని చెప్పుకుంటూ ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. రాంనగర్, బట్టీలగుంపు, చిన్నరాయిగూడెం, అనంతారం, అన్నారం, గుండ్ల సింగారం, విజయనగరం గ్రామాల పేరుతో గిరిజన సొసైటీలు ఏర్పాటు చేసి ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజనుల పేరును కవర్‌గా ఉపయోగించి వాస్తవానికి గుత్తేదారులతో కలిసి భారీ స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

నేనే మంత్రి అంటూ దూకుడు..!

జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులను తప్పుదారి పట్టిస్తూ నేను చెప్పిందే చట్టమంటూ వ్యవహరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. రాజకీయ అండదండలతో అక్రమ మైనింగ్‌ను అడ్డగోలుగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాలు బహిరంగంగా జరుగుతున్నా ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. ఈ అధికారి ఎనిమిది నెలలుగా అదే స్థానంలో కొనసాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఇన్ని ఆరోపణలు వచ్చినా బదిలీ లేకపోవడం వెనుక ఉన్న కారణాలపై చర్చ జరుగుతోంది.
నిబంధనల ప్రకారం గిరిజన సొసైటీలు లేబర్, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను సేకరించి ఒకచోట నిల్వ చేయాలి. కానీ ఇక్కడ భారీ యంత్రాలతో గోదావరిలో లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది. గిరిజనులకు ఉపాధి కల్పించాల్సింది పోయి వారి పేరుతో దందా నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అధికారుల మౌనం

మైనింగ్, విజిలెన్స్ శాఖలు స్పందించకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చిందని స్థానికులు అంటున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించబడుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మైనింగ్, విజిలెన్స్ అధికారులు జోక్యం చేసుకుని అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గోదావరి మరింతగా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! 20ఎక‌రాల భూ క‌బ్జాకు చెక్ 40కోట్ల విలువైన ప్ర‌భుత్వ ఆస్తికి ప‌రిర‌క్ష‌ణ‌ అక్షర...

గ్రామ సభలు విజయవంతం చేయాలి

గ్రామ సభలు విజయవంతం చేయాలి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం :...

నాణ్యమైన ఆహారం తప్పనిసరి

నాణ్యమైన ఆహారం తప్పనిసరి కొత్త‌గూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పాఠశాలల్లో సదుపాయాలపై కలెక్టర్ ఆగ్రహం కాకతీయ,...

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి అధికారుల పేరిట మోసాలకు ప్రయత్నం నగరపాలక...

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ ఏప్రిల్ 10 వరకు గ్రామాల్లో కొనసాగింపు సీపీఐ మండల...

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు మంత్రి పొంగిలేటిపై విష ప్రచారం మానుకోవాలి బీఆర్ఎస్...

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం : స‌ర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ కాకతీయ,...

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ కాకతీయ, కూసుమంచి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img