epaper
Monday, March 2, 2026
epaper

నేను రైతు బిడ్డ‌నే.. వారి క‌ష్టాలేంటో నాకు తెలుసు

నేను రైతు బిడ్డ‌నే.. వారి క‌ష్టాలేంటో నాకు తెలుసు
అన్న‌దాత‌ల‌కు అండగా ఉంటా – మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : నేను రైతు బిడ్డ‌నే.. రైతుల క‌ష్టాలేంటో నాకు బాగా తెలుసు.. అన్న దాత‌ల క‌ష్టాల్లో అండ‌గా ఉంటానని ఖ‌మ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర్‌రావు అన్నారు. ఖ‌మ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, రాజేశ్వరపురం గ్రామం లోని మధుకాన్ షుగర్ అండ్ పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2025–26 సీజన్ చెరకు గానుగ‌ను సోమ‌వారం ఆయ‌న ఘ‌నంగా ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా కర్మాగార వ్యవస్థాపకులు నామ నాగేశ్వరరావు, చిన్నమ్మ దంపతులు ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని చెరకు గానుగ ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన రైతులను నామా నాగేశ్వ‌ర్‌రావును వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులు గురించి తీసుకున్నారు. ఈ సందర్భంగా నామా నాగేశ్వ‌ర్‌రావు మాట్లాడుతూ క‌ర్మాగారం కొన్నప్పటి నుంచి ఆర్థికంగా భారీ నష్టాలు వస్తున్నప్పటికీ ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలిసిన వాడిగా రైతన్నలకు అండగా ఉంటూ రైతు శ్రేయస్సు దృష్ట్యా కర్మాగారాన్ని నడిపిస్తున్నామ‌ని అన్నారు. దేశంలోనే తొలి సారిగా రైతు సోదరుల కోరిక మేరకు టన్ను చెరుకు సరఫరా చేసిన రైతులకు అరకిలో పంచదార 2026-27 గానుగ సీజన్లో ఉచితంగా ఇస్తామని నామా ప్రకటించారు. కర్మాగారం అభివృద్ధికి మేనేజింగ్ డైరెక్టర్ నామ కృష్ణయ్య అహర్నిశలు కృషి చేస్తూన్నారని, భవిష్యత్తులో కూడా సిబ్బంది అంకిత భావంతో పని చేస్తూ ముందుకు సాగాలన్నారు.

క‌ర్మాగారాన్ని న‌మ్ముకుని వేలాది మంది రైతులు..!

కర్మాగారాన్ని నమ్ముకొని దాని వెనుక వేలాది మంది రైతులు, వందలాది కుటుంబాల జీవనం ఉందని, అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలూ వచ్చినప్పటికీ నిబద్ధతతోనూ ఈ కర్మాగారాన్ని ముందుకు తీసుకుపోతున్నామని నామా స్పష్టం చేశారు. రైతు సోదరులందరూ చెరకు విరివిగా సాగు చేసి కర్మాగారం అభివృద్ధికి తోడ్పడటంతో పాటు రైతు సోదరులు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. రైతులు అభివృద్ధి తనకు ముఖ్యమని, రైతులతోనే కర్మాగారం ముందుకు సాగుతుందని నామ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ చెక్కర కర్మాగారం ఇవ్వని విధంగా టన్నుకు అత్యధిక మద్దతు ధర ఇవ్వడంతో పాటు, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీకి కంటే మధుకాన్ చెక్కర కర్మాగారం అధిక సబ్సిడీ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. దేశీయంగా అనేక రాష్ట్రాల్లో చెక్కర పరిశ్రమలు మూతబడుతున్నప్పటికీ తెలంగాణ బిడ్డగా చెరకు రైతుల సంక్షేమం కొరకు కర్మాగారాన్ని నడిపిస్తూ కృషి చేస్తున్న నామను రైతన్నలు పెద్ద ఎత్తున అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల చెరకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని చెరకు గానుగ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కెన్ అసిస్టెంట్ కమిషనర్ రవీందర్ రావు, ఏవిపి వై. కోటయ్య, డీజీఎం కేన్ అప్పారావు, ఏజీఎం హెచ్ఆర్ నరేష్, విభాగాధిపతులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుతో పాల్గొని కార్యక్రమాన్ని శోభాయమానం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇండ్ల మధ్య సెల్ టవర్లు… ప్రజల్లో ఆందోళన

ఇండ్ల మధ్య సెల్ టవర్లు... ప్రజల్లో ఆందోళన రేడియేషన్ భయం... అనుమతులపై అనుమానాలు సాయినగర్‌లో...

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణంలో పట్టువస్త్రాల సమర్పణ కాకతీయ, కారేపల్లి: ఖమ్మం...

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి

ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి...

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ

మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామ...

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్

కరువులో ‘ఉపాధి’ దీపం వెలిగించిన సర్పంచ్ కాకతీయ, కారేపల్లి: కరువు కాటుతో పంటలు...

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా

పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా 14 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరి...

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img