హుస్నాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో
14 వార్డుల్లో 12 స్థానాల్లో ఘన విజయం
బీఆర్ఎస్కు కేవలం 2 స్థానాలు మాత్రమే
ఏకపక్ష విజయంతో కాంగ్రెస్ ఆధిపత్యం
కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 14 వార్డుల్లో 12 వార్డులను కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రారంభ ఫలితాల్లోనే కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలతో ఆధిక్యం ప్రదర్శించింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 14 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. రెండవ విడత ఫలితాల్లో కూడా కాంగ్రెస్ జోరు కొనసాగింది. 8వ వార్డులో కేశవేని సరిత సాంబరాజు, 10వ వార్డులో సావుల మంజుల రామకృష్ణ, 11వ వార్డులో ఊదారి వర ప్రసాద్, 12వ వార్డులో కేశవేని రమేష్, 14వ వార్డులో దండి లక్ష్మీ కొమురయ్య కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ 9వ వార్డులో గడిపే సంపత్, 13వ వార్డులో బొల్లి శ్రీనివాస్ గెలుపొందారు. మిగతా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.
కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ
మొత్తం 14 వార్డుల్లో 12 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడటంతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి నియంత్రణ సాధించింది. మ్యాజిక్ ఫిగర్ను దాటడంతో చైర్పర్సన్ పదవి కూడా కాంగ్రెస్కే దక్కడం ఖాయంగా మారింది. ఈ ఫలితాలతో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలమైన పట్టును ప్రదర్శించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పథకాలు, ప్రచార వ్యూహాలు కాంగ్రెస్ విజయానికి కీలక కారణాలుగా భావిస్తున్నారు.


