epaper
Saturday, November 15, 2025
epaper

మ‌ద్ద‌తు ధ‌ర‌పైనే ఆశ‌లు

  • దీపావళి తర్వాతే పత్తి కొనుగోళ్లు
  • ఏర్పాట్లు చేస్తున్న మార్కెట్ అధికారులు
  • జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల ఎకరాల్లో సాగు
  • వ‌ర్షాలతో 14 వేల ఎకరాల్లో పంట నష్టం
  • నష్టపోయిన పంటకు ఇప్పటికీ అంద‌ని ఆర్థికసాయం

కాక‌తీయ‌, ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాకాలం పంటలను వాతావరణం దెబ్బకొట్టింది. ముఖ్యంగా పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి ఏటా ఈ సమయానికి జిల్లాలో పత్తిపంట ఇప్పటికే ఒక దఫా తీయడం పూర్తయ్యేది. కానీ ఇప్పటికీ వర్షాలు పడుతుండడంతో మొదట వచ్చిన పత్తి కాయలు మురిగిపోయాయి. మిగిలిన కాయలు కొంత మేర పగలడంతో పత్తిని ఏరేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వాతావరణం పూర్తిస్థాయిలో అనుకూలించి ఎండలు కొడితేనే పత్తి ఏరేందుకు వీలుంటుంది. పత్తి తీత ఆలస్యం కావడంతో కొనుగోళ్లు సైతం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. దీపావళి తర్వాత అన్ని మార్కెట్ యార్డులో కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది.

దిగుబడిపై ప్రభావం

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 8.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా అత్యధికంగా 4.28 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. అయితే భారీ వర్షాలతో ఈ ఏడాది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 18 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా అందులో పత్తి పంట 14 వేల ఎకరాల్లో నష్టపోయారు. వరదల కారణంగా పంటలు కొట్టుకుపోయిఇసుక మేటలు వేయడంతోపాటు రాళ్లు తేలాయి. రెండో సారి పంట వేసుకునే వీలులేకండా పోయింది. నష్టపోయిన పంటకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క పంట ఎదిగే దశలో వర్షాలు పడటంతో పత్తి కాయలు మురిగిపోయి, పూత రాలిపోయింది. ఇలా పత్తి పంట దిగుబడులపై ప్రభావం పడింది. దీంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి క‌నిపించ‌డంలేదు. ఎకరానికి 4 క్వింటాళ్లరి పత్తి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి 1 రైతులు మద్దతు ధరపైనే ఆశలు పెట్టుకున్నారు. కాగా అధికారులు మాత్రం ఈ ఏడాది 30 లక్షల క్వింటాళ్లన దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈసారి కొత్త నిబంధనలు

ఈ సారి కొత్తగా తీసుకొస్తున్న కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్ విధానంతో రైతులకు మేలుజరుగనుంది. ఈ యాప్ ద్వారా మధ్యవర్తుల దోపిడీకి చెక్ పడనుంది. ఈ యాప్ ద్వారా నేరుగారైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ రాజర్షి షా ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్ విధానంపై వ్యవసాయ అధికారులకు అవగాహనకల్పించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్ యార్డులో కల్పించాల్సిన సదుపాయాలపై దిశానిర్దేశం చేశారు. గతంలో కొంతమంది వ్యాపారులు, దళారులు అధికారులతో కుమ్మక్కై ఇతర రైతుల పేరుతో సీసీఐకి పత్తి విక్రయించారు. దీంతో కొంత మంది అధికారులపై చర్యలుతీసుకున్నారు. రైతుల స్లాట్ బుకింగ్ ద్వారా ఇప్పుడు ఆ పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో పత్తితీత ఆలస్యమవుతోందని, ఈనెల 20 తర్వాతే పత్తికొనుగోళ్లు చేస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ గజానన్ తెలిపారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు

ప్రమాదాల నివారణకై అధికారుల చర్యలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరుగుతున్న రహదారి...

17 వ మహాసభ జయప్రదం చేయాలి

17 వ మహాసభ జయప్రదం చేయాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : మందమర్రిలో ఈ...

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

నివాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ఓపెన్ కాస్ట్ ఫేజ్...

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు కాకతీయ, రామకృష్ణాపూర్ : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప...

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్..

జూబ్లిహిల్స్ గెలుపు కాంగ్రెస్ అభివృద్ధికి మలుపు..ప్రణవ్.. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ బంపర్ "వి"క్టరీ.. సోమాజిగూడ...

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల

పొలం బాట పట్టిన మంత్రి తుమ్మల రఘునాథపాలెం మండలంలో పొలాలు సందర్శించిన మంత్రి...

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌

జమ్మికుంటలో అక్రమంగా నడుస్తున్న క్లినిక్ సీజ్‌ రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నిర్వహణ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ...

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ..

తిమ్మాపూర్ సర్కిల్ పోలీసు స్టేషన్లను తనిఖీ.. తనిఖీ చేసిన అడిషనల్ డీసీపీ వెంకటరమణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img