చైర్పర్సన్, వైస్ చైర్మన్కు సన్మానం
కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పెండెం లక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తాను నర్సంపేట డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు సత్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని కోరారు.
చైర్పర్సన్ లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ నరేందర్ గుప్తా అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో
అసోసియేషన్ అధ్యక్షుడు కాట శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అరెల్లి వేణు, మెరుగు కిరణ్ యాదవ్, దండెం రాజు, సీహెచ్ ద్రోణ, విక్రమ్, జూలూరి శివ, సందీప్, పాషా, మోహన్, శ్రీను నాయక్, ప్రవీణ్ పాల్గొన్నారు.



